Posts

ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

Image
  , నల్గొండ ,  21.2.2025        హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చిన్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశాలలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.        శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేయాలని అన్నారు .ఎక్కడైనా రెస్టారెంట్లు, హోటల్లు బడ్డీ కోట్లు, తోపుడు బండ్లు వారు వాడిన నూనెలను తిరిగి వాడడం ,అలాగే కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడటం వంటివి చేయకుండా తరచూ దాడులు నిర్వహించాలని, ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే సీజ్ చేయడమే కాకుండా, కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ ఇప్పటివరకు  అభద్రత ఆహార పదార్థాలను వినియోగించినందుకుగాను నల్గొండ జిల్లాలో 16 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా కలె...

భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పురందేశ్వరి

Image
 భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పురందేశ్వరి తెలంగాణ గాంధీగా ప్రసిద్ధి _చెందిన_ భూపతి కృష్ణమూర్తి గారి 99 వ జయంతి శుక్రవారం రోజున కరీంనగర్  వైశ్యభవన్ లో ఏర్పాటుచేసిన సమావేశమును ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ఎంపీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు మాట్లాడుతూ భూపతి కృష్ణమూర్తి గారి శతజయంతి వేడుకలు తమ చేతుల మీదుగా ప్రారంభించుట అదృష్టంగా భావిస్తూ ఆ మహానీయునికి పుష్పాంజలి ఘటించారు .భూపతి కృష్ణమూర్తి స్మారక కమిటీ ప్రతినిధి ఉప్పల రామేశం మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధేయ వాది, 1946 సంవత్సరంలో మహాత్మా గాంధీతో వారద సేవాశ్రమంలో పది రోజులు ఉన్నారని దండియాత్రలో పాల్గొని జైలు శిక్షలు, 1947 ,48 కాలంలో నిజాం రజాకారులను ఎదిరించి కొన్ని సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారని తెలియజేశారు, 1967 నుండి 72 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు, 2000 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు పాల్గొని జైలు శిక్ష అనుభవించారని తెలియజేశారు, ముల్కనూర్ కోపరేటివ్ సొసైటీ వ్యవస...

జిల్లా అధ్యక్షుడి పోస్ట్ చాల కాస్ట్లి గురూ?

Image
 జిల్లా అధ్యక్షుడి పోస్ట్ చాల  కాస్ట్లి గురూ? హైద్రాబాద్: ఆర్యవైశ్యుల ఐక్యతకు, బీద వారికి సేవ చేయడానికి, హక్కులు కాపాడడానికి, రాజకీయంగా కమ్యూనిటీ వ్యక్తులకు ప్రాధాన్యత పెంచడానికి ఏర్పడ్డ సంఘాలు చివరకు బేర సారాలకు నిలయంగా మారింది. 20 లక్షలు ఇస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భోనగిరి జిల్లా అధ్యక్ష పదవి యిప్పిస్తానని ఒక యువజన నాయకుడు ఓ జిల్లా నాయకుడితో బేరసారాలకు దిగినట్లు తెలుస్తుంది. 20లక్షలు ఇచ్చుక్కోలేనని అని అంటూ నాకు ఆ పోస్ట్ అక్కరలేదన్న ఆ జిల్లా నాయకుడు.  జిల్లా లోని అభివృద్ధి కార్యక్రమాలకు అని కొందరు, కాదు కాదని కొందరు  డిస్కస్ చేసుకుంటున్నారు.

అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్

*అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్* GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్‌, సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వేరే మహిళతో ఉన్న సమయంలో భార్య కళ్యాణి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.   కోపంతో  భార్య ఇద్దరినీ చితకబాదిన అనంతరం, పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించింది.

నేడు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి. 99 వ జయంతి

Image
 తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి. 99 వ జయంతి 21 ఫిబ్రవరి 2025 ( శత జయంతి మహోత్సవ సం వత్సరము 21 ఫిబ్రవరి 2026)  తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి 21 ఫిబ్రవరి 1926 లో ములుకనూరు లో జన్మించారు అమ్మమ్మ గారు వరంగల్ చెందిన ప్రముఖ చందా కాంతయ్య కుటింబీకులు వారసత్వం గా వచ్చిన అడితి వ్యాపారం వరంగల్ లోని గ్రేన్మార్కెట్ లో నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ భావాలకు ఆకర్షటిడై 1943 లో వరంగల్ లో నేషనల్ క్లబ్ స్థాపించారు ఆంధ్ర మహాసభ తో సంబంధం 1941-46 వరకు వరంగల్ పట్టణ కాంగ్రెస్ కోశాధికారి గా సేవలు 1946 లో ఖాదీ ప్రకాష్ సభ్యులు గా ఎన్నిక 1944 లో గాంధీ జన్మదినం (అక్టోబర్ 2) వార్దా సేవాస్రం లో పది రోజులు గాంధీ గారితో ఉన్నారు ఆగస్టు 11,1946 లో హయాగ్రీవాచారీ తో కలిసి జాతీయ జండా ఎగురా వేసి రజాకార్లతో దాడి దెబ్బలు 1947-48 తెలంగాణ విమోచన ఉద్యమం లో అజ్ఞాతా జీవితం 1968-71 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జైలు జీవితం 1972 రాష్ట్రము లోని ప్రజాసంఘాలు ఆయనకు తెలంగాణ గాంధీ అనే బిరుదు వరంగల్ పబ్లిక్ గార్డెన్ లో ప్రదానం జాతీయ ఉద్యమం [ స్వాతంత్ర ఉద్యమం ) దండి యాత్ర తెలంగాణ ఉద్యమం పలు మార్లు జైయిల్ దాదాపు 500 ఎకరాలు భూమ...

మహాసభ ఎన్నికలు సజావుగా జరగాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి*

Image
 *మహాసభ ఎన్నికలు సజావుగా జరగాలి* *హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు* 👉 *బేగంపేటలోని ఒక దారికి రోశయ్య మార్గ్ గా నామకరణం* 👉 *వెంటనే చర్యల కై అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి* 👉 *సీఎంని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసిన ఆర్యవైశ్య ప్రముఖులు* హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంఓ ఓ ఎస్ డి శేషాద్రిని ఆదేశించారు.  ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు మిగతా సంఘాల ఎన్నికలకు ఆదర్శంగా ఉండాలి. అందుకు అధికారికంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను చట్ట రీత్యా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  అలాగే తను కల్వకుర్తి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్య వైశ్యుల ముద్దు బిడ్డ రోశయ్య విగ్రహాన్ని హైదరాబాదులోని ఆయన ఇంటికి సమీపంలో గల ప్రకృతి చికిత్స ఆలయంలో ఏర్పాటు మరియు దానికి రోశయ్య  నామకరణం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.  అపర తెలంగాణ ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల పైన హైకోర్టులో writ పిటిషన్ దాఖలు

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల పైన హైకోర్టులో writ పిటిషన్ దాఖలు హైద్రాబాద్:  తెలంగాణ ఆర్యవైశ్య తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలపై హైకోర్టులో Writ petition WP 4612/2025 గా దాఖలయింది. సొసైటీల ప్రిన్సిపల్ సెక్రెటరీ, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ హైద్రాబాద్, మాజీ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ మరియు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ లను ప్రతివాదులుగా చేస్తూ చకిలం రమణయ్య, బచ్చు శ్రీనివాస్ హైద్రాబాద్ గార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రిజిస్ట్రేషన్ నెంబర్ 363 /2015 యొక్క ఎన్నికలు తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ  రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ ద్వారా  సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం బై లా ను సరిచేసి ఎన్నికలు నిర్వహించి, గత 2015 నుండి అన్ని  ఆర్థిక పరమైన అకౌంట్స్ ఆడిట్ చేయించి  కొత్త పాలక వర్గానికి అప్పగించాలని రిట్ ఆఫ్ మాండమాస్ కోరారు మరియు  ఇంటీరియమ్ స్టే ఇవ్వమని కోరారు. ఈ కేసు రేపు 20 వ తే...