రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా సంకల్పం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా సంకల్పం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమలులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు. వి హబ్ (We Hub Hyderabad) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు. కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలి. వారిని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నార...