పర్యావరణాన్ని పరిరక్షిద్దాం... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుదాం - మంత్రి కొండా సురేఖ

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పీసీబీ కార్యాలయంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సురేఖ హైదరాబాద్ పర్యావరణాన్ని పరిరక్షిoచుకొని... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత... మన అందరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం ఆమె అభిప్రాయపడ్డారు. మనం అందరం కలిసి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి… సంరక్షించుకోవాలనే బాధ్యతను ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇదొక విప్లవాత్మకమైన చర్యగా తాను అభివర్ణిస్తున్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, పిసిబీ బోర్డు మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, విజయ లక్ష్మీ, జయదేవ్, పిసిబి ఉద్యోగులు, సిబ్బంది...