సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
*సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..* Hydrabad, Gudachari: తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంది.. 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం. ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ విజన్ వల్లే దేశానికి ప్రపంచంతో పోటీ పడే శక్తి లభించింది. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. పెట్టుబడుల సరళీకరణ విధానం తీసుకొచ్చింది పీవీ నరసింహారావు. ఆనాడు నెహ్రూ, రాజీవ్, పీవీ ప్రవేశపెట్టిన పాలసీలను కొందరు వ్యతిరేకించారు. కానీ ఆ పాలసీలే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాయి. అధికారం కోల్పోయిన నిస్పృహతో కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు.. బందిపోటు దొంగల్లా పదేళ్లు తెలంగాణను దోచుకున్నవారు మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్త