Skip to main content

Posts

15 వేలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్

Recent posts

ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి రంగనాథ్

  ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి రంగనాథ్ *మల్టీ జోన్ 1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి రంగనాథ్*   అలసత్వంతో పోలీస్ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 జోన్ ఐ జీ ఎ. వి రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారిచేశారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు, ఇద్దరు సబ్ - ఇన్స్ స్పెక్టర్లు- ఒకరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ వున్నారు. ఈ సస్పెండ్ల కు సంబందించి మల్టీజోన్ ఐ. జీ వివరాలు తెలియజేస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఏం. ఎల్. ఎ షకీల్ కుమారుడు రాహిల్ ను తప్పించెందుకే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ తో సంప్రదింపులు జరిపినట్లుగా హైదరాబాద్ సిపి విచారణలో నిజ నిర్ధారణ కావడంతో బోధన్ ఇన్స్ స్పెక్టర్ బి. డి. ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేయగా, అలాగే యం. రమేష్ నిజామాబాద్ జిల్లా సిసి ఎస్ ఇన్స్ స్పెక్టర్ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేషన్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్లుగా అధికారుల

నల్గొండ జిల్లాకు వ్యయ పరిశీలకులుగా కళ్యాణ్ కుమార్ దాస్

 లోక్ సభ ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నల్గొండ జిల్లాకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ 2012 బ్యాచ్ కి చెందిన కళ్యాణ్ కుమార్ దాస్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రానికి రాగా, ఆర్ అండ్ బి అతిథి గృహంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ పూలబోకేతో స్వాగతం పలికారు. వీరు లోకసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా వ్యయపరిశీలకులుగా వ్యవహరిస్తారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధికారిక సెల్ ఫోన్ నెంబర్ 8121446758 లో అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నిక్షల అధికారి దాసరి హరి చందన తెలిపారు.
*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త* *కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి* ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీదే.. జాతీయ స్థాయిలో ఆర్యవైశ్యులను ఏకం చేస్తాం - *ఉప్పల* *కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త* కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాథ్యమని ఆలిండియా జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి తెలిపారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ టీడీసీ) మాజీ చైర్మన్, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ప్రెసిడెంట్, ఉప్పల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా బీఆర్ఎస్ ను వీడి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం గాంధీ భవన్ లో రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రెటరీ కుమార్ రావుల ఆధ్వర్యంలో *రోహిత్ చౌదరి* సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరగ, రోహిత్ చౌదరి శ్రీనివాస్ గుప్తాకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.... *ఈ కార్యక్రమంలో*... ఐవీఎఫ్ రాష్ట్ర కార్యదర్

సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి

 సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి* ************************************************** నల్లగొండ పట్టణంలో రెండో భద్రాద్రిగా పేరొందిన రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కానున్నారు.మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, పలువురు హాజరవుతారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం మంత్రి తిరిగి హైదరాబాదుకు వెళ్తారు.

జిల్లా అధికారుల అదుపులో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య..?

  జిల్లా అధికారుల అదుపులో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య..? సూర్యాపేట,:  *👉జిల్లాలోని పలు మిల్లులపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల ఆకస్మిక తనిఖీలు...* *👉జిల్లా అధికారుల అదుపులో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య..?* *👉సూర్యాపేటలోని జమ్మిగడ్డ అపార్ట్మెంట్ లో ఇమ్మడి సోమనర్సయ్య ను అదుపులోకి తీసుకొని తిరుమలగిరి తన మిల్లుకు తరలించినట్లు సమాచారం.?* *ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి CMR కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూర్యాపేట, తిరుమలగిరి, గరిడేపల్లి, కోదాడ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సూర్యాపేట మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య కూడా ఈ జాబితాలో ఉండడంతో తిరుమలగిరిలోని రెండు మిల్లుల్లో రెవిన్యూ, విద్యుత్, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులు మిల్లుకు కేటాయించిన ధాన్యం, ప్రస్తుతం అక్కడ ఉన్న స్టాక్ వివరాలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.* ఈయనకు సంభందించిన మిల్లుల  నుండి 450 కోట్ల విలువ చేసే ధాన్యాము  బాపతు CMR పెండిం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్స్ లో చేరనున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్స్ లో చేరనున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త IVF తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా రేపు 17న ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి రోహిత్ చౌదరి సమక్షంలో గాంధీ భవన్ నందు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందువల్ల IVF సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు శీనన్న అభిమానులు రేపు ఉదయం పార్టీలో చేరే కార్యక్రమంలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పాల్గొనే ప్రయత్నం చేయగలరని, దయచేసి దీనిని ఉప్పల శీను అన్న ప్రత్యేక మరియు వ్యక్తి గత ఆహ్వానంగా భావించగలరని ఐవిఎఫ్ తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం తెలిపారు
 దేవరకొండ లో ఈనెల 23న వీర హనుమాన్ విజయాత్ర  దేవరకొండ డివిజన్లో ఈనెల 23న జరగబోయే వీర హనుమాన్ విజయాత్ర విజయవంతం కొరకు ఏర్పాటు చేసిన సమావేశంలో బజరంగ్దళ్ తెలంగాణ ప్రాంత కోకన్వీనర్ కన్నెబోయిన వెంకట్  మాట్లాడుతూ హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని దేవరకొండలో మన హిందువుల ఐక్యతను సత్తాను చాటాలని అన్నారు కార్యక్రమంలో VHP దేవరకొండ నగర అధ్యక్షులు రామకృష్ణ చారి , కార్యదర్శి బాల లింగయ్య, సహకార్యదర్శి ముంత రామకృష్ణ, ఉపాధ్యక్షులు రాజుగారు బజరంగ్దళ్ దేవరకొండ నగర కన్వీనర్ శ్యామ్ గారు వివిధ క్షేత్ర పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు
నామినేషన్ల ప్రక్రియకు రాజకీయ పక్షాలు  సహకారం అందించాలి      లోక సభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు పూర్తి సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్ కోరారు.           సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నామినేషన్ల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.          ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలపై ఆయన  కూలం కుశంగా వివరించారు.      లోక సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 18 నుండి 25 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని , 26 నామినేషన్ల పరిశీలన, 29 న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు.         నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్న 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,మధ్యాహ్నం 3 తర్వాత నామినేషన్లు స్వీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు వారితోపాటు, అనుమతించే వ్యక్తులు, వాహనాలు, త
ACB కి చిక్కిన అధికారులు   18వేలు లంచం  * నల్గొండ జోన్‌లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్, మిర్యాలగూడ ఇన్‌చార్జి కె. సోమేశ్వర్ తన కార్యాలయంలో చిట్టెపు సైదిరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.18వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. డ్రగ్స్ లైసెన్స్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి లంచం ఇవ్వబడింది. 25వేలు లంచం ఆసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మి వెహిల్ రిలీజ్ గురించి 25 వెలు లంచం తీసుకుంటుండగా రెడ్ హెడ్డెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు...