Posts

ఏసీబీ నెట్‌లో మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

Image
 ఏసీబీ నెట్‌లో జనగాం జిల్లా పాలకుర్తి, (ఇంట్రా) సబ్-డివిజన్, మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కూనమల్ల సంధ్యా రాణి,  21.11.2025న, సాయంత్రం 5:10 గంటలకు, నిందితురాలు శ్రీమతి కూనమల్ల సంధ్యా రాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ (INTRA), సబ్-డివిజన్, పాలకుర్తి, జనగాం జిల్లా, వరంగల్ రేంజ్, ACB చేత పట్టుబడ్డారు. ఆమె తన కార్యాలయ గదిలో ఫిర్యాదుదారుడి నుండి రూ. 10,000/- లంచం డిమాండ్ చేసి, ఫోన్‌పే యాప్ ద్వారా తన ప్రైవేట్ అసిస్టెంట్ మహేందర్ మొబైల్ నంబర్‌కు అధికారిక అనుకూలంగా చూపించి, "దేవూరుప్పుల మండలంలో ఫిర్యాదుదారుడు అమలు చేసిన మూడు మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన M-పుస్తకాలు మరియు తుది బిల్లులను కొలవడానికి మరియు వాటిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు పంపడానికి" బదిలీ చేయడం ద్వారా దానిని స్వీకరించారు. సంబంధిత PhonePe లావాదేవీ యొక్క స్క్రీన్‌షాట్‌ను ఫిర్యాదుదారుడు నిందితుడి ఫోన్‌కు వాట్సాప్ సందేశం ద్వారా పంపగా, దానిని ప్రింట్ తీసి, లంచం చెల్లించినట్లు రుజువుగా నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల, నిందితుడైన అధికారిని అరెస్టు చేసి, వరంగల్‌లోని SPE ...

ఘనంగా బండారు సుబ్బారావు జన్మదినోత్సవం

Image
 ఘనంగా బండారు సుబ్బారావు జన్మదినోత్సవం చౌటుప్పల్, గూఢచారి: *అభినవ దానకర్ణుడు, సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు జన్మదినోత్సవం సందర్భంగా, ఆయన విలువైన పాలసీదారుడు కౌటికె విఠల్ ప్రత్యేకంగా 600 మంది నిర్భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, వారి దీవెనలను సుబ్బారావు కి అంకితం చేస్తూ జన్మదినాన్ని అర్ధవంతంగా జరుపుకున్నారు.* *ఈ సేవా కార్యక్రమం చౌటుప్పల్ సమీపంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న అమ్మానాన్న అనాధ ఆశ్రమంలో నిర్వహించబడింది.* *కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ హాజరై, రిబ్బన్ కటింగ్ చేసి అన్నప్రసాదం ప్రారంభించారు.* *స్థానిక జీవిత బీమా ఏజెంట్లు, ముఖ్యంగా లియాఫీ అధ్యక్షులు సైదులు గారు తన తోటి నాయకులతో కలిసి హాజరై, ఆలిండియా నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన శ కౌటికె విఠల్ గారిని బొకేతో సత్కరించారు.* *పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం మరియు అనాధాశ్రమ చైర్మన్ గట్టు శంకర్ కార్యక్రమానికి విచ్చేసి, దేవాలయం – ఆశ్రమాన్ని శ్రద్ధగా దర్శింపజేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు...

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..

Image
 వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..  వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. ఆయనపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేశ్ అనే సబ్ రిజిస్ట్రార్ అనిశాకు చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌‌కు సబ్ రిజిస్ట్రార్ ఇన్‌చార్జి‌గా బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. హయత్‌నగర్ మండలం సాహె బ్‌నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నంబరులో వివాదానికి కారణమైన పార్కు స్థలం ఉంది. ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఉన్న లే అవుట్(అనధికారిక) ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పలువురు వివిధ కోర్టులను ఆశ్రయించి అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్కు ఉన్న ప్రాంతానికి కూడా బై నంబరుతో కొందరు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయగా సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్...

"మాచన" కు గవర్నర్ ఎక్స్ లెన్స్ అవార్డు?!

Image
 "మాచన" కు గవర్నర్ ఎక్స్ లెన్స్ అవార్డు?! రాజ్ భవన్ కు ఆన్లైన్ నామినేషన్ పొగాకు నియంత్రణ లో అసాధారణ కృషి కి గాను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ కు గవర్నర్ ఎక్సెలెన్స్ అవార్డు కు ఎంపిక అయ్యారు.2020 నుంచి 2025 వరకు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాజభవన్ అవార్డుల ను ప్రకటించింది.ఇందులో భాగంగా..మాచన ను ఆన్లైన్ నామినేషన్ సమర్లించాల్సింది గా రాజభవన్ అధికార వర్గాలు తనకు ఫోన్ చేసి చెప్పారని రఘునందన్ బుధవారం తెలిపారు.పొగాకు నియంత్రణ లో భాగంగా..చేసిన, చేస్తున్న అసాధారణ కృషి తాలుకు సమగ్ర వివరాలను రఘునందన్ రాజభవన్ అధికారిక పోర్టల్ లో సమర్పించారు.రెండు దశాబ్దాల కు పైగా పొగాకు నియంత్రణ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాచన రఘునందన్ కు తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా 2026 జనవరి 26 న ఎక్స్ లెన్స్ అవార్డు ప్రదానం చేసే అవకాశం ఉంది.

రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్

Image
 రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్ హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు...

ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్ AE & సబ్-ఇన్‌స్పెక్టర్

Image
 ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్ AE & సబ్-ఇన్‌స్పెక్టర్ ACB వలలో వనపర్తి డివిజన్ & సర్కిల్ గోపాలపేట విభాగం, అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) TGSPDCL  18-11-2025న, నిందితుడైన అధికారి (AO), శ్రీ నరవ హర్షవర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్), TGSPDCL, గోపాల్ పేట్ సెక్షన్, వనపర్తి డివిజన్ & సర్కిల్, తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు, అంటే "ఫిర్యాదుదారుని బంధువు వ్యవసాయ పొలాలలో DTR (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరు చేయడానికి" ఫిర్యాదుదారుడి నుండి ₹40,000 లంచం డిమాండ్ చేసి, చెల్లింపులో భాగంగా 20,000 తీసుకున్నాడు.   AO వద్ద నుండి ₹20,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.  AO ని అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని గౌరవనీయులైన I అదనపు ప్రత్యేక న్యాయమూర్తి, SPE & ACB కేసుల విచారణ కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందనీ, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామనీ అధికారులు తెలిపారు. ******************************************* ACB నెట్‌లో మెదక్ జిల్లా టేక్మల్ పోలీస...

TGPCB ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ

Image
  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) లో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు బాధ్యతగల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు  18 నవంబర్ 2025న ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించింది.మండలిలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు, సిబ్బంది మరియు అధికా లు కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ సభ్య కార్యదర్శి శ్రీ జి. రవి ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుండి రక్షించేందుకు అవగాహన, అప్రమత్తత, వ్యక్తిగత బాధ్యత అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా, పిల్లలు మరియు యువ మేధావులు మాదక ద్రవ్యాల ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారు. పాఠశాల పిల్లలు, యువత మాదక ద్రవ్యాలు కలిగించే శాశ్వత హానిని తెలియక, వాటిని పెద్దగా పట్టించుకోకుండా, భవి...