*సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు*
*సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు* *సూర్యాపేట, సెప్టెంబర్ 3:* ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కోదాడ మున్సిపాలిటీ ఇన్చార్జ్ టీపీఓ *వుయ్యాల సోమయ్య* పై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువులు, అనుచరులకు సంబంధించిన మొత్తం 7 చోట్ల సోదాలు నిర్వహించారు. *సోదాల్లో బయటపడిన ఆస్తులు:* - సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి - విలువ రూ.2,94,000 - సూర్యాపేట, హయత్నగర్ పరిధిలో 5 నివాస భవనాలు (G+1, G+2, G+4 + పెంట్ హౌస్, 2 గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు) - విలువ రూ.2,75,00,000 - సూర్యాపేట పరిధిలో 8 ఓపెన్ ప్లాట్లు - విలువ రూ.2,58,500. వీటి మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. - నగదు రూ.4,63,990 - బ్యాంకు బ్యాలెన్స్ రూ.13,00,000 - 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1750 గ్రాముల వెండి ఆభరణాలు - విలువ సుమారు రూ.20,00,000 - 2 ఫోర్ వీలర్లు, 3 టూ వీలర్లు - విలువ రూ.25,20,000 - గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు - ...