Posts

"ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు"

Image
  "ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”  హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ (IVF) ప్రధమ మహిళ  శ్రీమతి ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”.  సామాజిక సేవా రంగంలో మరియు మహిళా సాధికారత కోసం ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అమీర్‌పేటలోని AAA సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” వేడుకలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: ఉప్పల స్వప్న పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ.. మహానటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నెలకొల్పిన ఈ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. "నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుతో సమాజం పట్ల నా బాధ్యత మరి...

‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత?

Image
 గూఢచారి స్పెషల్: ‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత? యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చోవడం, సూటు-బూటు వేసుకుని గంభీరంగా గొంతు సవరించుకోవడం, తామేదో సమాజాన్ని ఉద్ధరించే ‘మేధావులం’ అని కలరింగ్ ఇచ్చుకోవడం... ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా విశ్లేషకులకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా లెఫ్ట్ సిద్ధాంతాల ముసుగులో, విశ్లేషణల పేరుతో సనాతన సంస్కృతిని, సంప్రదాయాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్‌గా మార్చారు. కానీ వీరు గుర్తించని నిజం ఒక్కటే... ఈ దేశ మూలాలను కదిలించడం మీ యూట్యూబ్ థంబ్నైల్స్ మార్చినంత సులువు కాదు! 2000 ఏళ్ల చరిత్రే ఏం చేయలేకపోయింది.. మీరెంత? ఈ దేశంపై ఎందరో దండయాత్రలు చేశారు. 2000 ఏళ్లుగా ఎందరో పాలకులు ఈ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూశారు. నలందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టారు, దేవాలయాలను కూల్చారు, మతాంతర మార్పిడులకు ఒడిగట్టారు. కానీ, ఇంతటి పెనుతుఫానులను తట్టుకుని, కాల గర్భంలో కలిసిపోకుండా నేటికీ సజీవంగా, సగర్వంగా నిలబడింది మన భారతీయ సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని, చరిత్రను... నాలుగు వ్యూస్ కోసం, కొన్ని లైక్స్ కోసం యూట్యూబ్ ఛ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

Image
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా? తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కుల బాంధవుల శ్రేయస్సు, పేద వైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సాగాల్సిన మహాసభ.. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన “పక్షపాత మహాసభ”గా మారుతోందా అనే అనుమానాలు సగటు ఆర్యవైశ్యుడి మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ.. ఇప్పుడు మహాసభ పునాదులను కదిలిస్తోంది. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కేవలం తూతూమంత్రంగా జనగాం నుండి మహిళా విభాగంలో ఒకరికి స్థానం కల్పించి చేతులు దులుపుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అసలు సిసలైన సింహభాగం పదవులన్నీ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు, కొద్దిమంది ప్రభావశీలురకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొత్త సీసాలో పాత సారా: ఒకరికే అన్ని పదవులా? ఇటీవల కొండ్రే మల్లికార్జున్ ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సంఘంలో అ...

ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!

Image
ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్! హైదరాబాద్:గూఢచారి:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎట్టకేలకు కీలక  సర్దుబాటు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, దాదాపు రెండు నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత తన కోటరీని సిద్ధం చేసుకున్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొండ్లే మల్లికార్జున్ ను నియమించారు, కోశాధికారిగా రేణుకంట్ల గణేష్ గుప్తాను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.  ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంఘంలో హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తుల నడుమ నియామకాల జోరు! ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కార్యవర్గ విస్తరణ జరగకపోవడంతో ఇన్నాళ్లూ రకరకాల ఊహాగానాలు సాగాయి. తీరా ఇప్పుడు నియామకాలు జరిపినా, అంతర్గతంగా అందరినీ సమన్వయం చేయడం అమరవాదికి అంత తేలికైన విషయమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ పదవుల పంపకంపై హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆశావహుల అసంతృప్తి సెగలు కూడా లోపాయికారీగా పొగలుగక్కుతున్నట్లు సమాచారం. తెరపైకి 'బైలా' వివాదం.. రిజిస్ట్రార్ నోటీసుల ...

శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్!

Image
శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్! మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మరోసారి అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. భూమి కన్వర్షన్ కోసం ఏకంగా రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. రూ.30 లక్షల డీల్.. ఎకరానికి లక్ష చొప్పున వేట! శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని కన్వర్షన్ (ల్యాండ్ కన్వర్షన్) చేయడానికి సంబంధించి ఒక రైతు కన్సల్టెంట్ నుంచి ఇక్కడి అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు. డ్రైవర్ ద్వారా వసూళ్లు.. రెడ్ హ్యాండెడ్‌గా! లంచం మొత్తంలో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. తహసీల్దార్ (ఎమ్మార్...

మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి

Image
  మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి  సంగారెడ్డి  అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును సంగారెడ్డికి చెందిన సీనియర్ నేత డాక్టర్ శ్రీహరి మంగళవారం ఉదయం కలిశారు. ఇటీవల హరీష్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని  అన్నారు.నాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు . తిరిగి కెసిఆర్ పాలన వస్తుందని చెప్పారు . యువ నాయకుడు శ్రీకాంత్ కూడా హరీష్ రావును కలిసిన వారిలో ఉన్నారు.

అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు!

Image
అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు! * కమిటీల పేరుతో కలెక్టర్, పిసిబి మెంబర్ సెక్రటరీ కాలయాపన!* ఫిర్యాదుదారుల గొంతు నొక్కుతున్న TSPCB! * 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం. * తనిఖీలు వాయిదా వేసి పరిశ్రమలకు 'క్లీన్ చిట్' ఇచ్చే కుట్ర?  (హైదరాబాద్‌ గూఢచారి)  ప్రజా ఆరోగ్యం కంటే పారిశ్రామికవేత్తల లాభాలే పరమావధిగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు M/S హెజెలో లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంతమ్మగూడెం) M/s బృందావన్ లాబొరేటరీస్ (ఎలగిరి) M/S శ్రీ జయ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S రావూస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఎస్ వి ఆర్ లాబొరేటరీస్ (దోతీగూడెం) M/S వి.జె. సాయి కెమ్ (దోతీగూడెం) M/S కెమిక్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆర్కిమెడిస్ లాబొరే...