Posts

*గోవిందరావుపేట తహశీల్దార్ ఏసీబీ వలలో.. రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం*

Image
 *గోవిందరావుపేట తహశీల్దార్ ఏసీబీ వలలో.. రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం* *ములుగు జిల్లా, సెప్టెంబర్ 18:* ములుగు జిల్లాలో అవినీతి అధికారి ఆట కట్టించింది ఏసీబీ. గోవిందరావుపేట మండల తహశీల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు గోవిందరావుపేట MRO ఆఫీసులో దాడి చేసి తహశీల్దార్ *నెల్లుట్ల సృజన్ కుమార్* ను పట్టుకున్నారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడి భార్య లింగాల శ్రీలత పేరు మీద పూర్వీకుల వ్యవసాయ భూమిని వారసత్వంగా మార్చేందుకు (Succession) తహశీల్దార్ రూ.15,000 లంచం అడిగాడు. బేరం ఆడాక రూ.14,000 కు ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేశారు. ఈరోజు రూ.14,000 తీసుకుంటుండగా తహశీల్దార్ ను పట్టుకున్నారు. లంచం డబ్బును కుడి చేతితో తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అతని చేతివేళ్లకు కెమికల్ టెస్ట్ చేయగా పింక్ కలర్ గా మారి పాజిటివ్ వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ

Image
 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ మిర్యాలగూడ: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరులను, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మిర్యాలగూడ టౌన్ వైస్ ప్రెసిడెంట్ వంశీ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. గత చరిత్ర మనకు ధైర్యంగా నిలబడటం, అన్యాయాన్ని ఎదుర్కోవడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండటం వంటి విలువలను నేర్పిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ బాధ్యతను గుర్తించి మంచిగా చదువుకుంటూ, సమాజానికి మరియు దేశానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరుణ్, నాగరాజు, వెంకట్, పార్థు తదితరులు పాల్గొన్నారు.

రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

Image
 *రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్* *ఖమ్మం, సెప్టెంబర్ 17:* ఖమ్మం జిల్లాలో మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. *ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి* చర్ల మండలం సత్యనారాయణపురం లోని *ఎస్టీ బాయ్స్ హాస్టల్ (ఐటీడీఏ)* లో వార్డెన్ గా పనిచేస్తున్న *భూక్యా వాల్ సింహ* తన హాస్టల్ లో పనిచేసే వర్కర్ (కుక్) జీతం బిల్లు చేయడానికి రూ.14,000/- లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి, ఈరోజు వార్డెన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల నుండి కూడా ఏసీబీకి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో వరుస దాడులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

*చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్*

Image
 *చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్* *రంగారెడ్డి, సెప్టెంబర్ 17, 2026:* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. లంచం తీసుకుంటూ సబ్-ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏసీబీ కథనం ప్రకారం..* చేవెళ్ల డివిజనల్ సబ్-ట్రెజరీ ఆఫీస్ లో పనిచేస్తున్న - *AO-1: మాదిగ లక్ష్మయ్య - సబ్-ట్రెజరీ ఆఫీసర్* - *AO-2: కావలి అనూరాధ - అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్* ఒక ఉద్యోగి సస్పెన్షన్ కాలపు జీతం బిల్లులు రూ. 23,25,390/- మరియు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బకాయిలు రూ. 4,29,000/- ప్రాసెస్ చేసినందుకు గాను రూ. 2,50,000/- లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ. 1,00,000/- తీసుకుంటుండగా ఏసీబీ రంగారెడ్డి రేంజ్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. AO-1 లక్ష్మయ్య రూ. 50,000/- నేరుగా తీసుకోగా, AO-2 అనూరాధ చెప్పడంతో మిగిలిన రూ. 50,000/- ను *A3: వడ్డే జంగయ్య @ చిన్న (ప్రైవేట్ వ్యక్తి)* తీసుకున్నాడు. ఇద్దరి నుండి లంచం సొమ్మును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ముగ్గ...

*టీజీపీసీబీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం*

Image
 *టీజీపీసీబీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం* *సనత్‌నగర్, సెప్టెంబర్ 17:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) సనత్‌నగర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని దేశభక్తి, గౌరవభావంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతను, తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, ఐక్యతను గుర్తుచేశారు. తెలంగాణ సాధించిన ప్రగతి ప్రజల త్యాగాలు, ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. *పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి: చైర్మన్* అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని చైర్మన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భ...

*ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకే ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి*

Image
* ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి* *హైదరాబాద్:* ఉప్పల్ భగాయత్ లో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్యవైశ్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని *మహాసభ ప్రక్షాళన కమిటీ తొలి విజయం* గా చెప్పుకోవచ్చు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి *"నిర్మిస్తున్న ఈ ఆత్మగౌరవ భవన్ పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఉపయోగపడాలి. ఆర్యవైశ్యులంతా కలిసి ఉండండి, రాజకీయాల్లో రాణించండి"* అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆర్యవైశ్యులు పేదలకు ఎలాంటి పూచీ లేకుండా ఉద్దెర ఇచ్చి ఆదుకుంటారని కొనియాడారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ ఆర్యవైశ్యలకే ఇచ్చామని తెలిపారు. ఆత్మగౌరవ భవన్ కు ఆర్థిక సహాయం కోరారని, నిబంధనల మేరకు చేస్తామని తెలిపారు. *ఎందుకు ఇది ప్రక్షాళన కమిటీ విజయం?* గత కొన్ని నెలలుగా మహాసభ ప్రక్షాళన కమిటీ లేవనెత్తుతున్న ప్రధాన డిమాండ్ ఇదే. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవన్ కేవలం కొందరు పెద్దలకోసం, ఫంక్షన్ హాల్ గా మిగిలిపోకుండా.. ప...

ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post వైరల్ అవుతుంది 👇👇👇👇👇

Image
ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post మస్తు వైరల్ అవుతుంది మరి ఈ పోస్ట్ రేవంత్ రెడ్డి కి చేరేనా? ఆలోచించినా అన్న డిస్కస్ పెరుగుతుంది 👇👇👇👇👇 ఈ క్రింది లింక్ టచ్ చేసి చూడొచ్చు https://www.instagram.com/reel/DdLsIJmRH1a/?stkn=MWw1eWMzaXpjd2pjYg==