*ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత*
*ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత* *7, లోక్ కల్యాణ్ మార్గ్లో రక్షాబంధన్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలుగు అమ్మాయి* *న్యూఢిల్లీ:* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆత్మీయంగా జరిగాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన చిన్నారులు, విద్యార్థినుల మధ్య ఈ వేడుకలో తెలుగు విద్యార్థిని *సాయి మధుమిత* ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఢిల్లీలో 12వ తరగతి MBiPC చదువుతున్న సాయి మధుమిత ఈ ప్రత్యేక వేడుకలకు ఆహ్వానం అందుకుని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీకి రాఖీ కట్టే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ప్రధానమంత్రికి స్వయంగా రాఖీ కట్టడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, ఎంతో సంతోషంగా ఉందని మధుమిత తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్నారులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో సరదాగా హై-ఫైవ్స్ ఇస్తూ సందడి చేశారు. రక్షాబంధన్ వేడుకలకు సంబంధించిన మధుర క్షణాలను ప్రధాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రక్షాబంధన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత, సామరస్య బంధాలను మరింత బలోపే...