Posts

"హీరో"అవార్డు ఓ అద్భుతం..అతిశయం

Image
 "హీరో"అవార్డు  ఓ అద్భుతం..అతిశయం నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత. మాచన రఘునందన్ మాతృమూర్తి "విజయ" ప్రత్యేక ఇంటర్వ్యూ  "అమ్మా..! డిల్లీ నుంచి ఓ పార్సెల్ వస్తుంది.తీసుకో..మళ్లీ అది వాపస్ పోతే రావడం కష్టం. అని మా అబ్బాయి చెప్తే.. ఏదో.. కవర్,చిన్న పార్సిల్ వస్తుందేమో అనుకున్నా..కాని  ఓ నగల పెట్టే లా..బరువు ఉన్న బాక్స్ వస్తుంది అని అనుకోలేదు. అత్యంత భద్రంగా.. ఏదో విలువైనది ఇందులో ఉన్నది అనుకునేలా.. బందబస్త్ పార్సెల్ వచ్చింది. "రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తరం అందుకోవడం అంత సామాన్య విషయమా?!" నా..బిడ్డ దేశం కోసం ఆలోచించడం.దేశం కోసం ఏదైనా మేలు చేయాలి అని క్షణ క్షణం ఆలోచిస్తేనే కదా..అసాధారణ విజయం సొంతం అయ్యేది. అని.. తన తనయుడు చేసిన  అలుపెరుగని కృషి గురించి ఎంతో ఆర్ద్రంగా వివరించారు మాచన విజయ. ఇన్నాళ్ళకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో  అద్భుత ఫలితం రావడం మాకు పద్మ పురస్కారమే అన్నారు "మాచన" మాతృమూర్తి. మరిన్ని వివరాలు..ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో.. మాచన విజయ మాటల్లోనే.. "ఎంత సంపాదించాము. ఎంత కూడబెట్టుకున్నాం అని ఆలోచించే కొందర...

*"పర్యావరణ దినోత్సవం రోజే పర్యావరణ విధ్వంసంపై వినతి": మంత్రి కొండా సురేఖకు అంతమ్మ గూడెం బాధితుల ఆగ్రహ పత్రం - TGPCB నిర్లక్ష్యంపై నిప్పులు*

Image
  *"పర్యావరణ దినోత్సవం రోజే పర్యావరణ విధ్వంసంపై వినతి": మంత్రి కొండా సురేఖకు అంతమ్మ గూడెం బాధితుల ఆగ్రహ పత్రం - TGPCB నిర్లక్ష్యంపై నిప్పులు* *గుడాచారి.పేజ్ | ప్రత్యేక కథనం*  *హైదరాబాద్, అక్టోబర్ 18, 2026:* ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు జరుగుతున్న PCB కార్యాలయం గేటు దగ్గర పర్యావరణ విధ్వంసంపై వినతి పత్రం అందుకున్నారు మంత్రి కొండా సురేఖ.  "మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను చంపడానికి వాడిన పాస్జీన్ వాయువును ఇప్పుడు మా ఊరి గాల్లో వదులుతున్నారు" అంటూ యాదాద్రి జిల్లా అంతమ్మ గూడెం గ్రామస్తులు మంత్రికి నేరుగా మొరపెట్టుకున్నారు. *పర్యావరణ దినోత్సవం నాడే నిరసన గళం* జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా TGPCB సనత్‌నగర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, అంతమ్మ గూడెం గ్రామస్తులు నేరుగా వినతి పత్రం అందజేశారు. "పర్యావరణాన్ని కాపాడతాం అని వేదికలపై ప్రసంగాలు చేస్తున్న రోజే, మా ఊరిని విషపు గ్యాస్ ఛాంబర్‌గా మార్చిన వైనాన్ని మీ దృష్టికి తెస్తున్నాం" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. *గాల్లో విషం, నేలలో...

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా

Image
  ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా రాష్ట్రవ్యాప్తంగా 166 మెడికల్ షాపుల తనిఖీలు.. 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు గూఢచారి.పేజీ కోసం వార్తా కథనం: హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలతో అనుబంధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 166 మెడికల్ షాపులను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆన్‌లైన్ మందుల డెలివరీ సేవలకు సంబంధించిన లైసెన్స్ కలిగిన కేంద్రాలు, భాగస్వామ్య ఫార్మసీలు కలిపి 159 దుకాణాలు, అలాగే ఆన్‌లైన్ బీ2బీ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధంగా ఉన్న 7 మెడికల్ షాపులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మందుల విక్రయ బిల్లులను నిర్వహించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మరియు షెడ్యూల్-H1 మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం, కొనుగోలు ఇన్‌వాయిస్‌లను చూపించకపోవడం, వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందు...

*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?*

Image
*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?* *గుడాచారి.పేజ్ | ఎక్స్‌క్లూజివ్*  *"హైదరాబాద్ ZOలో కుర్చీ వదిలి, పటాన్చెరుకు పరుగు - కారణం అపరిశ్రమలతో కనెక్షన్' కోసమేనా?" - గుసగుసలు* *పటాన్చెరు, జూన్, 6, 2026:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి RC పురం రీజనల్ ఆఫీసులో నిబంధనలకు పాతరేసి 'సొంత' పాలన నడుస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ AE-2 స్థాయి అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. *ప్రభుత్వ వాహనం = సొంత కారు? ఆఫీసు పనులకు వాడాల్సిన ప్రభుత్వ వాహనాన్ని సదరు AE సొంత అవసరాలకు వాడేస్తున్నారని, రాత్రి పూట ఏకంగా ఇంటికే తీసుకెళ్తున్నారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కేడర్ అధికారులకు మాత్రమే వాహనాన్ని నివాసానికి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. ఈ AEకి ఆ అర్హత లేదని సమాచారం. మరి RO గారు ఏం చేస్తున్నట్లు? నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా? RO వెంటనే సరిచూసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. *'డిప్యుటేషన్...

*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు*

Image
*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు* *హైదరాబాద్:* “పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలి. మనం మన ప్రకృతి మాతను కాపాడుకోవాలి. అడవుల నరికివేత, వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ధాన్యం దిగుబడి తగ్గడం వల్ల ఆకలి పెరగడం వంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయి. చికిత్స కన్నా నివారణే మేలు”   ఇదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని TGPCB ప్రధాన కార్యాలయంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రి *శ్రీమతి కొండా సురేఖ* చేసిన వ్యాఖ్యలు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది ఇతివృత్తంగా ప్రకటించిన *“వాతావరణ చర్య”*పై ఆమె ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. కార్యక్రమానికి EFS&T ముఖ్య కార్యదర్శి *శ్రీ అహ్మద్ నదీమ్*, TGPCB బోర్డు సభ్యులు *సి. సత్యనారాయణ రెడ్డి*, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్సార్టియం అధ్యక్షురాలు *టి. విజయలక్ష్మి*, JNTU-హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ తదితరులు హాజరయ్యారు. *2047 నాటికి 250 కోట్ల మొక్కలు*   EFS&T ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్ల...

రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి

Image
  రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం  - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పీకర్ హామీ మద్దతుగా నిలిచిన ప్రముఖ పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్య సమస్యలపై "అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి" సమరశంఖం పూరించింది. హజేలో తదితర పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి గ్రామంలో జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమితి సభ్యులు బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాన్ని కాలుష్యం బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి ల సహకారంతో స్పీకర్‌కు ఓ సమగ్ర వినతిపత్...

# అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ!

Image
  ## అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ! **హైదరాబాద్, జూన్ 2 (గూఢచారి ప్రతినిధి):** రాజధాని నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే నివాస గృహాల వద్దే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోంచి దుండగుడు బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ### అసలేం జరిగిందంటే..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీలోని 'వేదశ్రీ అపార్ట్‌మెంట్‌'లో నివసించే శ్రీమతి రత్నమాల అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆమె అపార్ట్‌మెంట్‌ లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో, అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి కాలినడకన ఆమె వద్దకు వచ్చాడు. సదరు వ్యక్తి రత్నమాలతో మాటలు కలుపుతూ నమ్మించడమే కాకుండా, ఆమె ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసి ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసును తెంచుకుని వేగంగా పారిపోయాడు. అపహరణకు గురైన గొలుసు బరువు సుమారు **2.5 తులాలు** ఉంటుందని బాధితురాల...