Posts

హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

Image
హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్ల కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలన నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 66, 67, 68, 69లో నడుస్తున్న క్రషర్ యూనిట్లను బృందం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు డా. క్రిశాంక్, డా. వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రాచారి, కే. కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే KGF సినిమా గుర్తుకు వచ్చిందన్నారు. భూమాతను చెరబట్టి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత  ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని  అడ్వకేట్  కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ  ఓటర్ల లిస్టు లో అర్హత లేని వారు నల్లగొండ జిల్లా ఓటర్ల ను తయారు చేశారని అట్టి ఓటర్ లిస్టు చెల్లదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఎన్నికల కొరకు కోర్టు నియమించిన అడ్వకేటు కమీషనర్ పి. బాల గోపేంద్రనాథ్ కు అభ్యంతరాలు వ్యక్త పరుస్తూ భూపతి రాజు ఫిర్యాదు అందచేశారు. ఆ ఫిర్యాదు లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు తమరిని కోర్టు అడ్వకేటు కమీషనర్ గా నియమించారని ప్రస్తుతము ఉన్న ఓటర్స్టు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2026 మార్చి 3.4,5 తేదీలలో తెలపవలసిందిగా కోరుతూ ఈనాడు దిన పత్రికలో పబ్లిక్ నోటీసు ను తమరు ప్రకటించారని, నల్లగొండ ఓటర్ లిస్టు చెల్లదని వివరాలు తెలిపారు. నేను అనగా భూపతి రాజు (తండ్రి భద్రాద్రి) రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యుడననీ, ( జీవిత సభ్యునిగా నా సభ్యత్వ నంబరు 56924), ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షులు గా ఉన్నానని , నా అడ్రసు: 6-2-1061/2 , వీటి కాలని, నల్గొండ 508001 . సెల్: 9848490545 ని తమరికి చ...

ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..

Image
 ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ... హోలీ పండుగ ఐక్యత,స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు.భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్,అజయ్,మౌనేష్ సతీష్,విజయ్,సంపత్,వెంకటేష్ సుధీర్,నగేష్,శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌ హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు. ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర...

ఐ ఎన్ టి యు సి నేతకు ఘనంగా పదవి విరమణ వీడ్కోలు

Image
  ఐ ఎన్ టి యు సి నేతకు  ఘనంగా పదవి విరమణ  వీడ్కోలు  సంగారెడ్డి (కంది) ఎదు మైలారం ఓడిఎఫ్ కర్మాగారంలో శనివారం పదవి విరమణ పొందిన ఐ ఎన్ టి సి ప్రధాన కార్యదర్శి జోగన్న గారి యాదగిరికి కార్మికులు ఘనంగా వీడ్కోలు పలికారు మధ్యాహ్నం సమయంలో గేటు నుంచి బయటికి రాగానే ఆయనపై పూలు చల్లి అభినందించారు. గత 36 సంవత్సరాలుగా యాదగిరి విధులు నిర్వహించారని అన్నారు.సాధారణ కార్మికునిగా ఉద్యోగంలో చేరి కార్మిక సంఘం నేతగా అనేక పోరాటాలు నిర్వహించారని వక్తలు కొనియాడారు కార్మికుల పక్షాన పని చేయడంతో పాటు యాజమాన్యంతో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించినారని వారు అభినందించారు పేద కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం యాదగిరి ఇంతకాలం పనిచేసిన సంగతిని వారు గుర్తు చేసుకున్నారు పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి అత్యంత సహజమని వారన్నారు కార్మికుల పక్షాన యాదగిరి లాగా పోరాడే వ్యక్తిని ఇప్పట్లో చూడలేమని వారు పేర్కొన్నారు యాదగిరి మంజుల దంపతులను ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు అభినందించారు కార్మిక సంఘాల నేతలతో పాటు జోగిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, కుందారం రాజయ్య పోతేధర్ మనోహర్, లైన్స్ క్లబ్ కార్యదర్శి అంజయ్య పు...

70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........

Image
 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........ సూపరింటెండెంట్ (జనరల్) O/O ది కమిషనర్ & డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, సైఫాబాద్, హైదరాబాద్ మరియు సీనియర్ అసిస్టెంట్, 0/0 ది DEO రంగారెడ్డి ACB కి పట్టుబడ్డారు. 19.02.2026న, హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోని కమిషనర్ & స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ AO-1 సంగీత ఫణిరాజ్, AO-2 గుమ్మిడల శ్రీధర్ సీనర్ అసిస్టెంట్ 0/0 DEO ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం మొత్తాన్ని వసూలు చేసి, దానికి పాల్పడినప్పుడు ACB సిటీ రేంజ్-1 యూనిట్ వారిని పట్టుకుంది. "2026-2027 అకాడమిక్ సంవత్సరానికి ఫిర్యాదుదారు స్కూల్ CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడం, ఫైల్‌ను ఉన్నత అధికారులకు పంపడం" కోసం అతను ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం తీసుకోవడానికి పాల్పడ్డాడు. AO-2 వద్ద నుండి కళంకిత లంచం మొత్తం రూ. 70,000/- స్వాధీనం చేసుకున్నారు.  AO-1 మరియు AO-2 లను అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు, నాంపల్లి హైదరాబాద్. కేసు దర్యాప్తులో ఉంది.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్

Image
 భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది  ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు