పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ & ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలి*
*పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ & ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలి* *ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ విజయవంతం చేద్దాం* - రమావత్ సతీష్ ఎబివిపి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎబివిపి నాయకుడు రమావత్ సతీష్ ఒక ప్రకటన లో అన్నారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు ఆధారమైన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని తీసి వేసే కుట్ర చేస్తుందని గత మూడు సంవత్సరాలుగా 10 వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, విద్యార్థులు దోస్త్ ద్వారా అడ్మిషన్లు పొంది కళాశాలల్లో రిపోర్టింగ్ కోసం వెళితే ప్రభుత్వ కళాశాలలు కూడా విద్యార్థుల నుండి ముందే ఫీజు వసూలు చేస్తున్నారని దీని కారణంగా పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక విద్యకు దూరం అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ వైఖరిని మార్చుకొని పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తుందని హెచ్చర...