సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం!
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం! హైదరాబాద్ (గూఢచారి ): తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మేర కులస్తుల ఆకాంక్షను నెరవేరుస్తూ, ప్రత్యేకంగా 'మేర కార్పొరేషన్' ఏర్పాటు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కి కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తెలంగాణ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట రాజ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని మేర కులస్తుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు సమర్పించారు. తక్షణమే రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేర కులస్తులను గుర్తించి, కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా.. దానికి చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించడంపై సంఘ వెంకట రాజ్యం హర్షం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, కార్పొరేషన్ బలోపేతానికి మరియు కులస్థుల సంక్షేమానికి వెనువెంటనే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి ప...