Posts

ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..

Image
 ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ... హోలీ పండుగ ఐక్యత,స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు.భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్,అజయ్,మౌనేష్ సతీష్,విజయ్,సంపత్,వెంకటేష్ సుధీర్,నగేష్,శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌ హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు. ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర...

ఐ ఎన్ టి యు సి నేతకు ఘనంగా పదవి విరమణ వీడ్కోలు

Image
  ఐ ఎన్ టి యు సి నేతకు  ఘనంగా పదవి విరమణ  వీడ్కోలు  సంగారెడ్డి (కంది) ఎదు మైలారం ఓడిఎఫ్ కర్మాగారంలో శనివారం పదవి విరమణ పొందిన ఐ ఎన్ టి సి ప్రధాన కార్యదర్శి జోగన్న గారి యాదగిరికి కార్మికులు ఘనంగా వీడ్కోలు పలికారు మధ్యాహ్నం సమయంలో గేటు నుంచి బయటికి రాగానే ఆయనపై పూలు చల్లి అభినందించారు. గత 36 సంవత్సరాలుగా యాదగిరి విధులు నిర్వహించారని అన్నారు.సాధారణ కార్మికునిగా ఉద్యోగంలో చేరి కార్మిక సంఘం నేతగా అనేక పోరాటాలు నిర్వహించారని వక్తలు కొనియాడారు కార్మికుల పక్షాన పని చేయడంతో పాటు యాజమాన్యంతో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించినారని వారు అభినందించారు పేద కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం యాదగిరి ఇంతకాలం పనిచేసిన సంగతిని వారు గుర్తు చేసుకున్నారు పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి అత్యంత సహజమని వారన్నారు కార్మికుల పక్షాన యాదగిరి లాగా పోరాడే వ్యక్తిని ఇప్పట్లో చూడలేమని వారు పేర్కొన్నారు యాదగిరి మంజుల దంపతులను ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు అభినందించారు కార్మిక సంఘాల నేతలతో పాటు జోగిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, కుందారం రాజయ్య పోతేధర్ మనోహర్, లైన్స్ క్లబ్ కార్యదర్శి అంజయ్య పు...

70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........

Image
 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........ సూపరింటెండెంట్ (జనరల్) O/O ది కమిషనర్ & డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, సైఫాబాద్, హైదరాబాద్ మరియు సీనియర్ అసిస్టెంట్, 0/0 ది DEO రంగారెడ్డి ACB కి పట్టుబడ్డారు. 19.02.2026న, హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోని కమిషనర్ & స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ AO-1 సంగీత ఫణిరాజ్, AO-2 గుమ్మిడల శ్రీధర్ సీనర్ అసిస్టెంట్ 0/0 DEO ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం మొత్తాన్ని వసూలు చేసి, దానికి పాల్పడినప్పుడు ACB సిటీ రేంజ్-1 యూనిట్ వారిని పట్టుకుంది. "2026-2027 అకాడమిక్ సంవత్సరానికి ఫిర్యాదుదారు స్కూల్ CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడం, ఫైల్‌ను ఉన్నత అధికారులకు పంపడం" కోసం అతను ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం తీసుకోవడానికి పాల్పడ్డాడు. AO-2 వద్ద నుండి కళంకిత లంచం మొత్తం రూ. 70,000/- స్వాధీనం చేసుకున్నారు.  AO-1 మరియు AO-2 లను అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు, నాంపల్లి హైదరాబాద్. కేసు దర్యాప్తులో ఉంది.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్

Image
 భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది  ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు

నుమాయిష్ 2026లో ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా టి జి పి సి బి స్టాల్ ఎంపిక.

Image
  నుమాయిష్ 2026లో ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా టి జి పి సి బి స్టాల్ ఎంపిక. హైద్రాబాద్: ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా ఎంపిక అయ్యింది ఈ స్టాల్ కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. కలిగించింది.   ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను (టీజీపీసీబీ) ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించ...

ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ .

Image
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది -  జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ . మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.         బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన  వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల లో ఏర్పాటుచేసిన  పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ...