*నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి*
*నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి* *నల్లగొండ:* వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. శాంతి సంఘ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. - ప్రతి గణేష్ మండపాన్ని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. - ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించడం, డ్రంక్ డ్రైవింగ్ వంటివి చేయరాదు. - ఫేక్ న్యూస్, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. అలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. - నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. - డీజేలు, సౌండ్ సిస్టమ్ల విషయంలో నిబంధనలు పాటించాలి. - ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దు. *"ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుందాం. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం"* అని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి చే...