*తెలంగాణలో RTI అమలుపై కీలక PIL*
*తెలంగాణలో RTI అమలుపై కీలక PIL* *నేడు హైకోర్టులో విచారణ - ఆన్లైన్ పోర్టల్, వర్చువల్ విచారణలపై దృష్టి* *హైదరాబాద్:* తెలంగాణలో సమాచార హక్కు చట్టం - RTI 2005 అమలును మరింత పటిష్టం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం W.P. (PIL) No. 18 of 2026 పై *నేడు* తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిల్ ను విచారించనుంది. ఈ పిల్ ను _బానప్పగారి వినయ్ రెడ్డి_ పార్టీ-ఇన్-పర్సన్ గా దాఖలు చేశారు. *PIL లో ప్రధాన డిమాండ్లు ఏంటి?* ఈ పిల్ లో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు: 1. *RTI ఆన్లైన్ పోర్టల్ సమర్థవంత అమలు:* RTI దరఖాస్తులు, అప్పీళ్లను ఆన్లైన్ ద్వారా సులభంగా వేసేలా పోర్టల్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. 2. *వర్చువల్/హైబ్రిడ్ విచారణలు:* తెలంగాణ సమాచార కమిషన్ లో భౌతికంగా హాజరుకాకుండానే వర్చువల్ లేదా హైబ్రిడ్ విధానంలో విచారణలు నిర్వహించాలి. 3. *పౌరులకు సులభ సమాచారం:* ప్రభుత్వ సమాచారాన్ని పౌరులకు వేగంగా, సులభంగా అందించే విధానాలను రూపొందించాలి. *ఎందుకు ప్రాధాన్యత?* పారదర్శకత, జవాబుదారీతనం, ప...