Posts

మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.

Image
  మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.                 ఘనంగా ఐవిఎఫ్ మహిళా దినోత్సవం.                          ప్రజా ప్రతినిధులకు సన్మానం  నల్లగొండ మార్చి 21, గూఢచారి :                  మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలని పురుషులతో సమానంగా ఎదగాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన ఐవీఎఫ్ మహిళా దినోత్సవం ప్రజాప్రతినిధులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపార పరంగా ఎదగాలన్నారు. మహిళలకు ఓర్పు సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మహిళలను గౌరవించడం వారిని సన్మానించడం మంచి సంప్రదాయమన్నారు. మహిళలు లేని సమాజం లేదని మహిళలు గౌరవించినచోట శుభాలు క...

వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మేడా నరేష్

Image
  వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మేడా నరేష్ హైద్రాబాద్: వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ యొక్క గ్లోబల్ ప్రెసిడెంట్ 2026-2028) గా ఉదయం 10:00 లకు లక్ష్మీ కన్వెన్షన్, ఖర్మాన్‌ఘాట్, హైదరాబాద్ లో మేడా నరేష్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అధికారిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఈ రోజు స్త్రీత్వ స్ఫూర్తిని గౌరవించడానికి కూడా అంకితం చేయబడిందనీ మేడా నరేష్ తెలిపారు. ఈ నాయకత్వ మార్పునకు మరియు సాధికారతను మనం అందరం సమిష్టిగా జరుపుకుంటున్న ఈ వేడుకకు మీ రాక ఎంతో శోభను చేకూరుస్తుందని తెలిపారు.

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం

Image
 అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం  * 22న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హ‌ణ‌  * ప్ర‌పంచ రికార్డు సృష్టించ‌నున్న ఘ‌ట్టం * స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌స్తున్న ఆర్య‌వైశ్యులు  * విజ‌య‌వంతం చేయాల‌ని కల్వ సుజాత గుప్త పిలుపు  హైద‌రాబాద్‌:  హైద‌రాబాద్‌ ఎల్ బీ స్టేడియం మ‌రో అద్భుత చారిత్ర‌క ఘ‌ట్టానికి వేదిక కాబోతోంది.  ఈ నెల 22న ఆదివారం ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్టు సౌజ‌న్యంతో తెలంగాణ ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.  దాదాపు 30 వేల మంది వైశ్యులు ప్ర‌ముఖ క‌వి చింత‌ల శ్రీ‌నివాస్ రచించిన 102 చ‌ర‌ణాల‌తో కూడిన వాస‌వీ పారాయ‌ణాన్ని సామూహికంగా ఆల‌పించ‌నున్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన ఇన్ని వేల మంది ఒకే స్వ‌రంతో పారాయ‌ణం చేయ‌డం ప్ర‌పంచ‌రికార్డు కానుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.  ఈ ఘ‌న‌త‌ను రికార్డు చేయ‌డానికి గిన్నీస్ ప్ర‌తినిధులు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.  ఆధ్యాత్మిక , సేవా కార్యక్ర‌మాల్లో ముందుండే ఆర్య‌వైశ్యులంద‌రినీ ఒక్క‌తాటిపైకి తేవ‌డ‌మే ఈ కార...

ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

Image
 ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నల్గొండ:   ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 21-03-2026 శనివారం రోజు ఉదయం 10.30 లకు నల్గొండ క్లాక్ టవర్ సమీపంలోని డైన్ ఇన్ హోటల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మరియు నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధుల తో పాటు నల్గొండ పట్టణ ప్రముఖులు అనగా మేయర్ డిప్యూటీ మేయర్ తదితరులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలకు తంబోలా ఇతర ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వబడును ఎర్లీ బర్డ్ బహుమతి ప్రధానం కూడా చేస్తారు.  అనంతరం భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడినదనీ, భోజన విరామం తర్వాత ప్రజా ప్రతినిధులకు సన్మానం, చివరిగా ఐ వి ఎఫ్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసామని నిర్వాహకులు తెలిపారు.   ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు మహిళ విభాగ్ అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పబ్బా చంద్రశేఖర్ గుప్తా, మహిళా న...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం

Image
ఎవరి ధీమా వారధి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం *ముందంజ లో శ్యామ్ సుందర్*   *అపవాదు ముటగట్టు కున్న అమరవాది.* హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ మహాసభ కు మొదటి సారి ఎన్నికల పోలింగ్ మంగళవారం లక్డికపూల్ వాసవి సేవ కేంద్రమంలో జరగనుంది.  మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన అమరవాది లక్ష్మీనారాయణ, కరీంనగర్ కు చెందిన బుస్సా శ్రీనివాస్ లు ఈ ఎన్నికల్లో పోటీపడు తున్నారు. అయితే ఉపసంహరణ అనంతరం బుస్సా శ్రీనివాస్ విరమించుకున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.  గత 12 ఏండ్ల నుండి ఎన్నికలు అమరవాది జరపలేదని అక్రమంగా ఉన్నాడని, శ్యాంసుందర్ వర్గం కోర్టుకు పోయి అమరవాది అక్రమాలను ప్రశ్నించడం తో కోర్టు అడ్వకేటు కమీషనర్ చే ఎన్నికలు కొనసాగించడానికి ఆర్డర్ ఇచ్చింది.  గత సంవత్సరం ఎన్నికలు ప్రకటించిన అమరవాది బైలా కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అక్రమంగా శ్యాంసుందర్ నామినేషన్ ను తిరస్కరించడం తో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అమరవాదిని ముద్దాయిగా ఆర్యవైశ్య...

దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్

Image
 BREAKING: దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్  కుత్బుల్లాపూర్ జోన్ దుంగిడల్ సర్కిల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (TPS) సంజనను అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. జోనల్ కమిషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న ACB అధికారులు దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారిక నగదు లావాదేవీలు ఆమె భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగా చర్యలు తీసుకున్నారు.

మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు

Image
 జై వాసవి జై జై వాసవి  మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడి బహిరంగ ప్రకటన చదవండి.  తెలంగాణ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ మెంబర్ లందరికీ నమస్కారం, ఈనెల 17వ తారీఖున రాష్ట్ర మహాసభ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు కింది విషయాలను గమనించి ఓటు వేయగలరని మనవి,  *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకత్వ మార్పు కోసం పోరాటం చేస్తున్న మిడిదొడ్డి శ్యాంసుందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం, ఏ మంచి పని అయినా మారుపుతోనే సాధ్యం.*   ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అమరవాది లక్ష్మీనారాయణ గారు నైతికంగా ఓడిపోయారు.  అమరవాది లక్ష్మీనారాయణ గత 13 సంవత్సరాలుగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా కొనసాగారు, మళ్లీ అతనికి అధ్యక్ష పదవి కట్టబెడదామా??  తెలంగాణ రాష్ట్రంలో అమరవాది లక్ష్మీనారాయణ గారు తప్ప వైశ్య కులంలో ఎవరు తెలివిగల వాళ్ళు, సమర్ధులు, నాయకత్వ లక్షణం గల వాళ్ళు లేరు అనుకోని ఎప్పటికీ తానే శాశ్వతంగా నియంత మాదిరిగా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారు, అతనిని సమర్థిద్దామా??  రాష్ట్రంలో ఆర్యవైశ్య...