*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*
*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం* హైద్రాబాద్ : మహాసభ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తును జిల్లా రిజిస్ట్రార్ తిరస్కరించినప్పటికీ, అప్పీల్ దశలో ఆయనకు న్యాయం లభించింది. అప్పిలేట్ అధికారి అయిన DIG పూర్తి స్థాయిలో విచారణ జరిపి, మహాసభ క్యాష్ బుక్, లెడ్జర్, సభ్యుల జాబితా వంటి కీలక సమాచారాన్ని వెంటనే సేకరించి అందించాలని జిల్లా రిజిస్ట్రార్ను ఆదేశించారు. ‘పబ్లిక్ అథారిటీ’గా మహాసభ – 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కీలకం ఈ కేసులో ఒక ముఖ్య అంశం మహాసభను “పబ్లిక్ అథారిటీ”గా పరిగణించాల్సిన అవసరం. భూపతి రాజు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఉచితంగా మహాసభకు కేటాయించింది. ప్రభుత్వ ఆస్తులు లేదా వనరులు పొందిన సంస్థలు ప్రజల పర్యవేక్షణకు లోబడతాయని, అందువల్ల అవి RTI చట్ట పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. భూపతి రాజు మాట్లాడుతూ, “ఇది పారదర్శకత కోసం పోరాటంలో తొలి విజయం. గత 11 ఏళ్లుగా మహాసభ నాయకులు ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. అలాగే ఆర్థిక లావ...