Posts

అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది!

Image
 అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది! తొందర పాటు తో తప్పులు చేయొద్దు! టీయూ డబ్ల్యూ జే జిల్లా నేతలు  సంగారెడ్డి : అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తుల కు సంబంధించి సోమవారం వరకే గడువు అనేది పూర్తిగా అవాస్తవం అని టీ యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట ఉపాధ్యక్షుడు ఎం ఎ కే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అసిఫ్ పేర్కొన్నారు. ఇంకా జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటు కాలేదని వారన్నారు. ఈ కమిటీ ఏర్పాటు కావడానికి సమయం పడుతుందని అన్నారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం జరగడానికి మరో రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ సమావేశం జరిగి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టు మిత్రులందరికీ కార్డులు వచ్చే విధంగా కొన్ని గైడ్ లైన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఈ కారణంగా దరఖాస్తు చేసుకునే గడువు ఇంకా ఉన్నదని స్పష్టం చేశారు. జర్నలిస్టు మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. అందరూ ఒకటే సారి దరఖాస్తు ...

*ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం*

Image
  *ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం* - పాత్రికేయుల హక్కుల కోసం పోరాటం  – సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి ఖమ్మం, ఏప్రిల్ 03 అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ఇకపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, ఇది కేవలం కొందరి వ్యక్తిగత అవసరం కాదని, మొత్తం పాత్రికేయ వర్గ భద్రత, జీవన హక్కులకు సంబంధించిన కీలక అంశమని టిడబ్ల్యూజెఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిరోజూ వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులకే కనీస గృహ భద్రత లేకపోవడం దురదృష్టకరమని, 'కలం పట్టే చేతులకు కనీస స్థలం కూడా దక్కకపోతే అది వ్యవస్థ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం అనేది ఒక్కో వ్యక్తి కోరిక కాదని, ఇది వృత్తి గౌరవాన్ని కాపాడే హక్కు పోరాటమని ఆయన పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం నిర్వహించిన పలు ఆందోళనలు, వినతిపత్రాల కార్యక్రమాలు, దీక్షలు, నిరసనల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఒ...

ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన

Image
  ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన హైద్రాబాద్:  నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం మరియు విపత్తు నిర్వహణ) కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సనత్నగర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా  పి. శరత్, పర్యావరణ శాస్త్రవేత్త, విద్యార్థులతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, బయోమెడికల్ వ్యర్థాల కాలుష్యం, మురుగునీటి శుద్ధి విధానాలు వంటి వివిధ కాలుష్య రకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు మరియు శిక్షలు గురించి వివరించి, పరిశ్రమలు మరియు సంస్థలు పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్లో భాగంగా విద్యార్థులను TGPCB ప్రయోగశాల సౌకర్యాలను చూపించి, వాయు మరియు నీటి కాలుష్య స్థాయులను కొలిచే పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులకు కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, పర్యావరణ పర...

Nirmal District SI ACB trap

Image
  Nirmal District SI ACB trap  నిర్మల్: నిర్మ ల్ జిల్లా మామడలో నిశ్శబ్దంగా సాగుతు న్న ఒక అవినీతి కథకు ఈరోజు థ్రిల్లింగ్ క్లైమాక్స్ కు చేరింది. ప్రజలకు రక్షణ గా నిలవాల్సిన ఒక పో లీస్ అధికారి అదే అధికారాన్ని ఆ యుధంగా మార్చుకుని లంచాల వల వేస్తూ చివరకు రెడ్ హ్యాండెడ్‌ గా చిక్కడంతో కథ కంచికి చేరింది. ఇప్పటివరకు గుట్టుగా నడిచిన ఈ వ్యవహారం ఒక్కసారిగా బహిర్గతమై, ప్రజల్లో షాక్‌తో పాటు ఆగ్రహా న్ని రేపుతోంది. “రక్షకుడే భక్షకు డైతే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఏసీబీ దాడుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జి ల్లా మామడ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తు న్న తీగల అశోక్ ఒక భూ వివాదం కేసులో ఫిర్యాదుదా రు కు సహాయం చేస్తానని చెప్పి, “మోసం కేసు నమోదు చేయ కుండా చూస్తాను” అంటూ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అ ధికారులకు తెలియజేయడంతో వారు జాగ్రత్తగా పన్నిన ఉచ్చులో అశో క్ చిక్కుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అశోక్ లంచం స్వీకరి స్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. అతని వద్ద నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్న...

ఏసీబీ నెట్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

Image
 టీజీఎస్‌పీడీసీఎల్, మసబ్ ట్యాంక్ సెక్షన్, హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ నెట్‌లో ఉన్నారు. 24.02.2026న, హైదరాబాద్, TGSPDCL, మసబ్ ట్యాంక్ సెక్షన్, ఆపరేషన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ (AO)  మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఫిర్యాదిదారుడికి చెందిన స్వాధీనం చేసుకున్న విద్యుత్ మీటరుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, తన కార్యాలయంలో ఫిర్యాదిదారుడి నుండి రూ. 16,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా సిటీ రేంజ్-II యూనిట్ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అతని సూచన మేరకు ఏఓ స్వాధీనంలో ఉన్న రూ. 16,000/- కలుషితమైన లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, ఏఓను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల గౌరవనీయ మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.

No.1 CLIA ఆయన సందర్భంగా కౌటికె విఠల్ బహిరంగ లేఖ

Image
  No.1 CLIA ఆయన సందర్భంగా కౌటికె విఠల్  బహిరంగ లేఖ చదవండి ఆయన మాటల్లో *ఈ గర్వకారణమైన, స్మరణీయమైన సందర్భంగా* *నా గౌరవనీయ పాలసీదారులు, శ్రేయోభిలాషులు, ప్రియ మిత్రులు మరియు నా సహచర ఏజెంట్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.* *ఈ విజయాన్ని నేను ఒంటరిగా సాధించలేదు—* *మీ అచంచల విశ్వాసం, నిరంతర ప్రోత్సాహం,మనం కలసి నిర్మించిన ఆత్మీయ బంధం ఈ స్థాయికి నన్ను చేర్చాయి.* *మీరు నాపై ఉంచిన నమ్మకం నా ప్రతి అడుగుకి దారిదీపంగా, నా ప్రతి విజయానికి మూలాధారంగా నిలిచింది.* *క్రమశిక్షణ(Discipline)* *దృఢ సంకల్పం (Determination)* *గౌరవం (Dignity)* *సమర్పణ (Delivery)* *ఈ నాలుగు విలువలు నా జీవన తత్వానికి ఆధారం.* *ఇవే నన్ను నేడు మీ ముందున్న స్థాయికి తీసుకువచ్చిన శక్తి.* *మీ ఆశీస్సులు, ఆదరణ, సహకారం ఇదే విధంగా కొనసాగాలని వినమ్రంగా కోరుకుంటూ, ఇంకా ఉన్నత* *శిఖరాలను అధిరోహించేందుకు మరింత నిబద్ధతతో, విశ్వసనీయతతో, అత్యుత్తమ సేవలతో ముందుకు సాగుతాను.* *ఎల్లప్పుడూ మీ సేవలో,* *కృతజ్ఞతాభివందనాలతో 🙏* *కౌటికె విఠల్* *చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్* *📞 98490 23530* *📞 70988 99999*

పరుగెత్తి..పట్టుకుని హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం

Image
 పరుగెత్తి..పట్టుకుని  హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ  మాచన రఘునందన్  నల్గొండ:  డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ల ను హోటళ్ల లో వాడితే చట్ట పరంగా శిక్షించడం తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు నల్గొండ పట్టణం లో పలు హోటళ్ల లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇళ్లలో వాడాల్సిన సిలిండర్లను హోటల్లో వాడటం నేరం అని స్పష్టం చేశారు.నల్గొండ లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు రఘునందన్ వివరించారు.ఇకనైనా హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల ను వాడటం కు స్వస్తి పలకాలని రఘునందన్ సూచించారు.హోటళ్ల వారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల ను మాత్రమే వాడాలన్నారు.