టీజీపీసీబీ ఆధ్వర్యంలో బ్యాటరీ వ్యర్థాల నిర్వహణపై 19న హైదరాబాద్లో వర్క్షాప్
బ్యాటరీ వ్యర్థాల నిర్వహణపై 19న హైదరాబాద్లో వర్క్షాప్ హైదరాబాద్, ఆగస్టు 15: బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ, వాటి నుంచి కీలక ఖనిజాల పునరుద్ధరణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని సనత్నగర్లో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఐఐటీ హైదరాబాద్ సమన్వయంతో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది. “పవరింగ్ సర్క్యులారిటీ: విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత (EPR) ద్వారా బ్యాటరీ వ్యర్థాల నిర్వహణను అభివృద్ధి చేయడం – కీలక ఖనిజాల పునరుద్ధరణ” అనే అంశంపై ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుండగా, ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 2026 సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు భారత్లో 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం (WCEF-2026) జరగనున్న నేపథ్యంలో ఈ వర్క్షాప్ను ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన నిల్వ కారణంగా దేశంలో బ్యాటరీల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాడిన బ్యాటరీల నుంచి కోబాల్ట్, నికెల్, లిథియం, అరుదైన ...