Posts

Nirmal District SI ACB trap

Image
  Nirmal District SI ACB trap  నిర్మల్: నిర్మ ల్ జిల్లా మామడలో నిశ్శబ్దంగా సాగుతు న్న ఒక అవినీతి కథకు ఈరోజు థ్రిల్లింగ్ క్లైమాక్స్ కు చేరింది. ప్రజలకు రక్షణ గా నిలవాల్సిన ఒక పో లీస్ అధికారి అదే అధికారాన్ని ఆ యుధంగా మార్చుకుని లంచాల వల వేస్తూ చివరకు రెడ్ హ్యాండెడ్‌ గా చిక్కడంతో కథ కంచికి చేరింది. ఇప్పటివరకు గుట్టుగా నడిచిన ఈ వ్యవహారం ఒక్కసారిగా బహిర్గతమై, ప్రజల్లో షాక్‌తో పాటు ఆగ్రహా న్ని రేపుతోంది. “రక్షకుడే భక్షకు డైతే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఏసీబీ దాడుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జి ల్లా మామడ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తు న్న తీగల అశోక్ ఒక భూ వివాదం కేసులో ఫిర్యాదుదా రు కు సహాయం చేస్తానని చెప్పి, “మోసం కేసు నమోదు చేయ కుండా చూస్తాను” అంటూ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అ ధికారులకు తెలియజేయడంతో వారు జాగ్రత్తగా పన్నిన ఉచ్చులో అశో క్ చిక్కుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అశోక్ లంచం స్వీకరి స్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. అతని వద్ద నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్న...

ఏసీబీ నెట్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

Image
 టీజీఎస్‌పీడీసీఎల్, మసబ్ ట్యాంక్ సెక్షన్, హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ నెట్‌లో ఉన్నారు. 24.02.2026న, హైదరాబాద్, TGSPDCL, మసబ్ ట్యాంక్ సెక్షన్, ఆపరేషన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ (AO)  మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఫిర్యాదిదారుడికి చెందిన స్వాధీనం చేసుకున్న విద్యుత్ మీటరుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, తన కార్యాలయంలో ఫిర్యాదిదారుడి నుండి రూ. 16,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా సిటీ రేంజ్-II యూనిట్ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అతని సూచన మేరకు ఏఓ స్వాధీనంలో ఉన్న రూ. 16,000/- కలుషితమైన లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, ఏఓను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల గౌరవనీయ మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.

No.1 CLIA ఆయన సందర్భంగా కౌటికె విఠల్ బహిరంగ లేఖ

Image
  No.1 CLIA ఆయన సందర్భంగా కౌటికె విఠల్  బహిరంగ లేఖ చదవండి ఆయన మాటల్లో *ఈ గర్వకారణమైన, స్మరణీయమైన సందర్భంగా* *నా గౌరవనీయ పాలసీదారులు, శ్రేయోభిలాషులు, ప్రియ మిత్రులు మరియు నా సహచర ఏజెంట్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.* *ఈ విజయాన్ని నేను ఒంటరిగా సాధించలేదు—* *మీ అచంచల విశ్వాసం, నిరంతర ప్రోత్సాహం,మనం కలసి నిర్మించిన ఆత్మీయ బంధం ఈ స్థాయికి నన్ను చేర్చాయి.* *మీరు నాపై ఉంచిన నమ్మకం నా ప్రతి అడుగుకి దారిదీపంగా, నా ప్రతి విజయానికి మూలాధారంగా నిలిచింది.* *క్రమశిక్షణ(Discipline)* *దృఢ సంకల్పం (Determination)* *గౌరవం (Dignity)* *సమర్పణ (Delivery)* *ఈ నాలుగు విలువలు నా జీవన తత్వానికి ఆధారం.* *ఇవే నన్ను నేడు మీ ముందున్న స్థాయికి తీసుకువచ్చిన శక్తి.* *మీ ఆశీస్సులు, ఆదరణ, సహకారం ఇదే విధంగా కొనసాగాలని వినమ్రంగా కోరుకుంటూ, ఇంకా ఉన్నత* *శిఖరాలను అధిరోహించేందుకు మరింత నిబద్ధతతో, విశ్వసనీయతతో, అత్యుత్తమ సేవలతో ముందుకు సాగుతాను.* *ఎల్లప్పుడూ మీ సేవలో,* *కృతజ్ఞతాభివందనాలతో 🙏* *కౌటికె విఠల్* *చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్* *📞 98490 23530* *📞 70988 99999*

పరుగెత్తి..పట్టుకుని హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం

Image
 పరుగెత్తి..పట్టుకుని  హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల స్వాధీనం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ  మాచన రఘునందన్  నల్గొండ:  డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ల ను హోటళ్ల లో వాడితే చట్ట పరంగా శిక్షించడం తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు నల్గొండ పట్టణం లో పలు హోటళ్ల లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇళ్లలో వాడాల్సిన సిలిండర్లను హోటల్లో వాడటం నేరం అని స్పష్టం చేశారు.నల్గొండ లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు రఘునందన్ వివరించారు.ఇకనైనా హోటళ్ల లో డొమెస్టిక్ సిలిండర్ ల ను వాడటం కు స్వస్తి పలకాలని రఘునందన్ సూచించారు.హోటళ్ల వారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల ను మాత్రమే వాడాలన్నారు.

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

Image
  అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి  అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం  * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ * ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం * వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం * శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం  * వాసవీ పారాయణానికి గిన్నీస్ రికార్డు  హైదరాబాద్: వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ, జయంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగానే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి తమ ప్రభుత్వంలో సముచిత గౌరవం ఉంటుందని ఆయన తెలిపారు. వైశ్యులు ఊరికొక్కరు ఉన్నా ఊరందరూ వారితో ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సహకారంతోనే రైతులు వ్యవసాయం చేసుకుంటారు న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర నిర్మాణంలో వైశ్యులది ముఖ్య పాత్ర అని కొనియాడారు.  రాజకీయంగా గుర్తింపు దక్కినా, దక్కకున్నా క్రమ శిక్షణ తప్పకుండా తమ పాత్ర పోషిస్త...

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్

Image
  తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి  * ఏపీ మంత్రి టీజీ భరత్  హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.  2014 నుంచి తెలంగాణలో వైశ్యులకు మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. జనాభా లో దాదాపు 5 శాతం ఉన్న ఆర్య వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  వైశ్యులు ఐకమత్యంతో ఉండి శక్తి చాటితేనే గౌరవం దక్కుతుందన్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. అందరు వైశ్యులు కూడా పేరు చివరన గుప్త అని పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేది ఆర్య వైశ్యులేనన్నారు.  అందరూ గోసేవ కూడా చేయాలని  ఆయన పిలుపునిచ్చారు. గోసేవ చేసిన ఫలితం గానే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. వాసవీ పారాయణ మహోత్సవాన్ని తలపెట్టిన కల్వ సుజాత గుప్తను ఆయన అభినందించారు.

పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల

Image
 *పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల* Hyderabad, Gudachari:  నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్త బీసీ ( చారి) కుటుంబానికి చెందిన జవహర్ నగర్ నివాసి ప్రమీల అనే దివ్యాంగురాలు వారి కుమార్తె జ్యోతి & వెంకట్ పెళ్లికి దంపతులకు పూస్తే మట్టెలు చీర అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అని దానిలో భాగంగానే పేదింటి ఆడపిల్ల వివాహానికి అండగా నిలవాలని ఎంతో మందికి పూస్తే మట్టెలు చీర అందజేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ సందర్భగా వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివ కృష్ణ గారు మాట్లాడుతూ ఎంతోమంది దివ్యాంగులకు పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ఉప్పల అందరికీ ఆదర్శం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న , IVF నాయకులు పబ్బా చంద్రశేఖర్ గుప్త , కటకం శ్రీనివాస్ గుప్త, Raghu Gangishett...