బ్యాటరీ వ్యర్థాల నిర్వహణలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యం
బ్యాటరీ వ్యర్థాల నిర్వహణలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యం హైదరాబాద్, ఆగస్టు 19: బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ, విస్తరించిన ఉత్పత్తిదారుల బాధ్యత (EPR), కీలక ఖనిజాల పునరుద్ధరణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ సమన్వయంతో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సహకారంతో బుధవారం సనత్నగర్లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. 90 మందికి పైగా ప్రతినిధులు వర్క్షాప్కు బ్యాటరీ తయారీదారులు, రీసైక్లర్లు, ఐఐటీ హైదరాబాద్కు చెందిన విద్యా నిపుణులు, CSIR-NML, CSIR-CECRI పరిశోధనా సంస్థల నిపుణులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు సహా 90 మందికి పైగా హాజరయ్యారు. అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, HBL ఇంజినీరింగ్ లిమిటెడ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. TGPCB మెంబర్ సెక్రటరీ అతిథిగా, CPCB రీజినల్ డైరెక్టర్ శ్రీమతి వరలక్ష్మి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సర్క్యులర్ ఎకానమీపై తెలంగాణ దృష్టి తెలంగాణ రైజింగ్–2047 విజన్లో భాగంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ల...