మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.
మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. ఘనంగా ఐవిఎఫ్ మహిళా దినోత్సవం. ప్రజా ప్రతినిధులకు సన్మానం నల్లగొండ మార్చి 21, గూఢచారి : మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలని పురుషులతో సమానంగా ఎదగాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన ఐవీఎఫ్ మహిళా దినోత్సవం ప్రజాప్రతినిధులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపార పరంగా ఎదగాలన్నారు. మహిళలకు ఓర్పు సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మహిళలను గౌరవించడం వారిని సన్మానించడం మంచి సంప్రదాయమన్నారు. మహిళలు లేని సమాజం లేదని మహిళలు గౌరవించినచోట శుభాలు క...