*రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.* సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య ను, ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు . గతం లో ఈ విషయం పై gudachari vartha https://www.gudachari.page/2024/04/blog-post_17.html
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్ హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి కార్యవర్గ సమావేశంలో తీర్మానించి నట్లు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు కర్మన్ ఘాట్ వేడుక కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ మీటింగ్ లో మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించి నట్లు శ్యామ్ సుందర్ తెలిపారు. రెండు, మూడు నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయన అన్నారు. ఈ సమావేశం లో మలిపెద్ది శంకర్, కాచం సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ, మొగుళ్లపల్లి ఉపేందర్, యాదా నాగేశ్వర రావు, మోటూరి శ్రీకాంత్, బొడ్ల మల్లిఖార్జున్, అర్థం శ్రీనివాస్, వందనపు వేణు, పుల్లూరు సత్యనారాయణ, బాలరాజు, కొండూరు గణేష్, కొండూరు రాజేశ్వరి మరియు పలు జిల్లాల నుండి సుమారు 300 మంది పాల్గొన్నారు.
మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష! . హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది. ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు చదవండి 17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు స్క్యూటిని సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్. : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్, లో జరుగుతుంది. 4-2025 మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును. 1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడు...
Comments
Post a Comment