అలాట్ మెంట్ లేని రైస్ మిల్లుకు ధాన్యం తరలింపు?


                                     (ఫైల్  ఫొటో)


అలాట్ మెంట్ లేని రైస్ మిల్లుకు ధాన్యం తరలింపు?


నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ఈ సీజన్ లో    200 పైగా ప్యాడి పర్చేసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ  కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతుల నుండి ధాన్యం   కొనుగోలు కు అన్ని ఏర్పాటు చేసింది.  ఆ సెంటర్ల  నుండి  కొనుగులు చేసినవి అలాట్ చేసిన మిల్లుల కు పంపిస్తూ  వివరాలను ఏ ఏ రైతు నుండి కొనుగులు  చేసినది, ఆ ధాన్యం ఏ ఏ మిల్లులు  పంపింది అన్న సమాచారం  జిల్లా సివిల్ సప్లై  అధికారులకు  పంపాలి.  అయితే దానికి విరుద్ధంగా అలాట్ మెంట్ కానీ  మిల్లు కు, ఓ సెంటర్  నుండి  దాదాపు 25 లారీల  కోటిన్నర విలువ గల వడ్లు ఓ అధికారి  పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ విషయాన్ని కప్పిపుచ్చు కోవడానికి ఆ అధికారి  అలాట్ మెంట్ చేయని రైస్ మిల్లుకు అలాట్  మెంట్ ఇప్పించడానికి నానా ప్రయాస  పడుతున్నట్లు ,  అలాట్ మెంట్ కానీ ఆ  యజమానికి సహకరిస్తు రకరకాల ప్రయత్నాలు చేసుకొమ్మని  సలహాలు ఇస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.  రాజకీయ వత్తిడి, సంఘాల నుండి వత్తిడి తెచ్చి డిఫాల్టర్ అయిన రైస్ మిల్లులకు అలాట్ మెంట్  చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ విషయం పై  డిఎం సివిల్ సప్లై అధికారిని మా ప్రతినిధి సంప్రదించగా  ఈ విషయం పై జిల్లా సహకార అధికారిని సంప్ర దించమని  తెలపడంతో వారిని వివరణ అడుగగా మా  దృష్టికి రాలేదని, ఎంక్వరి చేస్తామని తెలిపారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్