చిన జీయర్ స్వామికి VHP శుభాకాంక్షలు


 

చిన జీయర్ స్వామికి VHP శుభాకాంక్షలు



త్రిదండి చిన జీయర్ స్వామి కి విశ్వ హిందూ పరిషత్ (VHP) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా స్వామిని ఆత్మీయంగా సత్కరించింది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన చిన జీయర్ స్వామి బుధవారం తిరిగి వచ్చారు. గురువారం విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు వెళ్లి ముచ్చింతల లోని స్వామివారి ఆశ్రమంలో ఆత్మీయంగా కలిశారు. స్వామి ధార్మిక, సామాజిక సేవను భారత ప్రభుత్వం గుర్తించి అవార్డు అందజేయడం గొప్ప విషయమని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యకారిణి సభ్యులు రాఘవులు అన్నారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు లక్ష్మి శేఖర్, పగుడాకుల బాలస్వామి, డివిఎస్ఎన్ మూర్తి, పతంజలి ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు , సురేష్, తదితరులు స్వామీజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్