సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

 


*సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?*

*కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్*


*సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే*


*సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే*


*రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం*


*తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర*


*అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది*


*ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేయడమే తప్ప చేసిందేమీ లేదు*


*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు*


*ప్రధాని క్రుషి వల్లే యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడి*


సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం స్రుష్టిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు...


అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్రమోదీ క్రుషి వల్లే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నం. 2014లో ఐక్య రాజ్యసమితిలో మోదీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగాప్రకటించాలని ప్రతిపాదించడంవల్లే గత పదేళ్లుగా జూన్21 రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం.  


అన్ని రోగాలకు పరిష్కారం యోగా. చిన్నా పెద్ద తేడా లేకుండా క్రమం తప్పకుండా యోగా చేయాలి. ‘మన శ్రేయస్సుతోపాటు సమాజ శ్రేయస్సు’ అనే నినాదంతో ఈసారి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.


సింగరేణిపై తప్పుడు ప్రచారం. ప్రజలను అయోమయం చేసే కుట్ర. మోదీ రామగుండం వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమే. రాష్ట్రానిది 51 శాతం ఉంది. అట్లాంటప్పడు రాష్ట్ర అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎట్లా సాధ్యం?


సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. తాడిచర్లలో ఏపీ జెన్ కోకు ఇస్తే... కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా? సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆర్. ఆయన మూర్ఖత్వపు ఆలోచనవల్ల సింగరేణిని పూర్తిగా దెబ్బతీశారు. తన కుటుంబానికి ఏటీఎంగా మార్చుకున్నారు. 


కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే... సింగరేణి కార్మికుల పట్ల ప్రేమ ఉంటే గతంలో కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము మీకుందా? నిన్న ఓ టీవీ ఛానల్ చర్చలో బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఎస్.కుమార్ సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని ప్రశ్నిస్తే... కాంగ్రెస్ నేత మాట్లాడుతూ తప్పనిసరిగా సింగరేణిపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి లేఖ రాసే దమ్ముందా? 


కేసీఆర్ కుటుంబం స్వలాభం కోసం సింగరేణిలో పొట్టుపొట్టు అవినీతి చేస్తే... కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది. కేసీఆర్ సర్కార్ గతంలో నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ  వంటి వాటిపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చారు. కాంగ్రెస్ కూడా  అంతే. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప వేరే ఆలోచనలే లేదు.. మళ్లీ చెబుతున్నా. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం కేంద్రానికి సాధ్యమే కాదు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్