ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి


 


'ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

 
నల్లగొండ, గూఢచారి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీ బలోపేతానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తి ఓరుగంటి రాము లు అని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ లో నిర్వహించిన దివంగత బీజేపీ నేత ఓరుగంటి రాములు ప్రథమ వర్థంతి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా రాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా ప్రజా సమస్యలపై ఓరు గంటి రాములు ఢిల్లీలో కూడా ఆందోళన చేసిన వ్యక్తి అని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీ గా పోటీ చేసినప్పుడు తన గెలుపు కోసం రాములు ఎంతగానో కృషి చేశారన్నారు. రాములు సంఘ్ కార్యకర్త నుంచి బీజేపీలో సీనియర్ లీడర్గా ఎదిగారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి సఫలీకృతం కాకున్నా పార్టీని గ్రామగ్రామానికి తీసు కెళ్లాడన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఓరుగంటి రాములు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలు, ధర్మం, హిందూ సమాజ రక్షణ కోసం పాటుపడ్డారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి మాట్లా డుతూ కార్యకర్తలకు అండగా నిలిచి జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి ప్రమాదంలో చనిపో వడం బీజేపీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమం లో ఓరుగంటి రాములు సతీమణి ధనలక్ష్మి, ఆయన కుమారులు ఓరుగంటి వంశీ, ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి మాధవప్రసాద్, బీజేపీ నాయకులు  నూకల నర్సింహారెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, కల్లెం బాల్రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, చింతా ముత్యాల్రావు, పోతెపాక సాంబయ్య, పెరిక మునికుమార్, వివిధ పార్టీల నాయకులు చకిలం అనిల్కుమార్, యామ దయాకర్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్