IAS అధికారులకు CAT బిగ్ షాక్
IAS అధికారులకు CAT బిగ్ షాక్ హైదరాబాద్ , అక్టోబరు 15 (Gudachari) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) లో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు గట్టి షాక్ తగిలింది . డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని క్యాట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి సంబంధిత ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం విచారించిన క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. డీఓపీటీ ఆదేశాల మేరకు రిపోర్టు చేయాలని, ఎక్కడ ఉన్నా రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. యథావిధిగా రేపు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. IASల కేటాయింపుపై DoPTకి పూర్తి అధికారాలు ఉంటాయి. స్థానికత ఉన్నప్పటికీ మార్పిడికి మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయా?, అని క్యాట్ ప్రశ్నించింది. కాగా, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ , ఆమ్రపాలి కాటా , ఎ. వాణీ ప్రసాద్ , డి. రోనాల్డ్ రోస్ , జి. సృజన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయం