*ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం - జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి *



*ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం - జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి *


శుక్రవారం నాడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో నల్లగొండ పట్టణం లోని క్లాక్ టవర్ వద్ద నుండి  విద్యార్దినుల మరియు మహిళలు తో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఉాపి ప్రారంభించారు. ఈ సందర్బంగా  బేటి బచావో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్ ను విడుదల చేశారు.


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....* ఆడ పిల్లలను చదివించాలని, వారు చదువుకుంటే ఏదైనా సాధ్యమని అన్నారు. ప్రధానమంత్రి, ఉపాధ్యాయులు కావాలన్నా లక్ష్యాలను తేలికగా సాధించగలరని అన్నారు. ఆడపిల్లలు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. చదువు వలన కలిగే లాభాలను, ఎందుకోసం చదువుకోవాలి అనే విషయాల పట్ల కలెక్టరు విద్యార్ధులను అడిగి వారిలో ఆసక్తి కలిగించారు. 2015 నుండి ప్రారంభమైన జాతీయ బాలికా దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున పాఠశాలలు,  కళాశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో మహిళలకు, విద్యార్థినులకు వచ్చే మార్చి 8 వ తేదీ వరకు భ్రూణ హత్యలను నివారించడం, బాలికా విద్యను పోత్సహించడం, మహిళా సాధికారత దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, లింగ వివక్షత లేకుండా మహిళా సాధికారతను పోత్సహించడం దీని లక్ష్యాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిలలను చదివించడంలో అశ్రద్ద వహించకుండా వారికి ఏ రంగంలో ఇష్టముంటే వాటిలో ప్రోత్సహించాలని సూచించారు.


*జిల్లా న్యాయ సేవా అధారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి* ఈ సందర్భంగా మాట్లాడుతూ...  తల్లిదండ్రుల పెంపకంలో అమ్మాయిల పట్ల ఎలాంటి వివక్షత చూపకుండా అన్ని రంగాలలో సమానంగా పోత్సహించాలని అన్నారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, తల్లిదండులు తమ ఆస్తిలో పిల్లల పట్ల  ఎలాంటి వివక్ష చూపవద్దని అన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, చదువు ద్వరానే సాదధికారత సాధ్యమని అన్నారు. ఆడపిల్లలు అని రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.


కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ,  జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి కృష్ణవేణి, జువైనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ మోహన్ రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ వెంకన్న, గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి సరిత, సిడిపివోలు సూపర్వైజర్లు అంగన్వాడి  సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!