Posts

Showing posts from February, 2025

ఆరోగ్య కేంద్రాన్ని & సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

Image
   ఆరోగ్య కేంద్రాన్ని & సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్లగొండ జిల్లా:  @ నార్కెట్ పల్లి మండలం, అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మకంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. @ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన మెడికల్ అధికారి డాక్టర్ వరూధినికి సోకాజ్ నోటిస్ జారీ  @ అనుమతి లేకుండా విధులకు గైర్ హాజరైతే చర్యలు తప్పవు. మరోసారి హెచ్చరించిన జిల్లా కలెక్టర్       నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం నార్కెట్ పల్లి మండలం, అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్ ను,మందుల స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.  తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరూధిని ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైనట్లు సిబ్బంది ద్వారా ఆమె నిర్ధారించుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్ హాజరు కావద్దని జిల్లా యంత్రాంగం...

ACB నెట్ లో హెడ్మాస్టర్

Image
  ACB నెట్ లో హెడ్మాస్టర్ భద్రాద్రి కొత్తగూడెం,  ఫిబ్రవరి 28,  (గూఢచారి): కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ హైస్కూల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ DSP వై.రమేష్ తెలిపారు. కరాటే శిక్షణ పాఠశాలకు రూ.30 వేలు మంజూరు అయ్యాయి. ఇన్ స్ట్రక్చర్ కు కావలసిన రూ.30 వేలలో రూ.20వేలు డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడిని నిర్వహించినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు

మెట్రో రైల్ ఫేజ్‌-II కు అనుమతించాలని ప్ర‌ధాన‌మంత్రి కి విజ్ఞ‌ప్తి చేసిన సిఎం ఎ. రేవంత్ రెడ్డి

Image
 హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్‌-IIకు  అనుమతించాలని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.  * హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన 5 కారిడార్ల‌ను ప్ర‌తిపాదించామ‌ని వివ‌రించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గతో కలిసి ముఖ్య‌మంత్రి  న‌రేంద్ర మోదీ ని వారి నివాసంలో స‌మావేశ‌మయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. * రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ని కోరారు. ఉత్త‌ర భాగంతో పాటే ద‌క్షిణ భాగం పూర్త‌యితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగ‌ల‌మ‌న్నారు. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు ...

అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్

Image
 అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్.. కల్లు అమ్మడానికి లైసెన్స్ గల చోట అక్రమంగా కల్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు దారుని నుండి రూ.10,000/- రూపాయలు లంచం తీసుకుంటూ 25 ఫిబ్రవరి 2025 నాడు తెలంగాణ అవినీతి నిరోధక శాఖాధికారు లకు పట్టుబడిన నిర్మల్ జిల్లా భైంసా మండలం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లోని సబ్-ఇన్స్పెక్టర్ పాటిల్ నిర్మల మరియు కానిస్టేబుల్ సాలికె సుజాత. “లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌ల లో అక్ర‌మాల‌కు ప్ర‌భుత్వం చెక్‌

Image
 ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌ల లో అక్ర‌మాల‌కు ప్ర‌భుత్వం చెక్‌* *నిష్పాక్షికంగా ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌లు* *ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌ల లో అక్ర‌మాల‌కు ప్ర‌భుత్వం చెక్‌* *ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు*  హైద్రాబాద్, గూఢచారి:  తెలంగాణ రాష్ట్ర ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ( రిజి. నెం.363/2015) ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని వ‌చ్చిన ఫిర్యాదుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది.    ఎలాంటి అక్ర‌మాల‌కు తావులేకుండా ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ నుంచి ముగ్గురు ఉన్న‌తాధికారుల‌తో ఎన్నిక‌ల క‌మిటీని నియమించింది.   ఎన్నిక‌ల అధికారిగా డిఐజి ఎన్‌. సైదిరెడ్డి, స‌హాయ‌కులుగా ఖ‌మ్మం జిల్లా రిజిస్ట్రార్ ఎం. ర‌వీందర్ రావు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఎం. సంతోష్‌ల‌ను నియ‌మించింది.  ఇందుకు సంబంధించి మెమో నెం. 6395/ ఆర్ ఇ జి ఎన్ 2/ 2025 -2 ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.  ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌పై ఆర్య‌వైశ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు....

బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టి నూతన అధ్యక్షుని ఎన్నుకొండి - NLG జిల్లా మాజీ తెడ్ల జవహర్ బాబు*

Image
 *బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టి నూతన అధ్యక్షుని ఎన్నుకొండి - NLG జిల్లా మాజీ అధ్యక్షలు తెడ్ల జవహర్ బాబు*       నల్గొండ, గూఢచారి: మహాసభ స్టేట్ కౌన్సిల్ సభ్యులు దయచేసి సంఘం యొక్క పటిష్టతకు. సంఘం సంఘటితంకొరకు. సంఘ నియమనిబందనలను అనసరించని, బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టా లని కోరుతూ, బై లా అనుసరించే నూతన అధ్యక్షుని ఎన్నుకొనుటకు మీ అమూల్యమైన ఓటువేసి అత్యధిక మెజారిటితో గెలిపించగలరని నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు మాజీ అధ్యక్షలు తెడ్ల జవహర్ బాబు రాష్ట్ర స్టేట్ కౌన్సిల్. సభ్యులను కోరారు. వ్యక్తులపై అభిమనంకన్నా.సంఘంయొక్క పద్దతులుమిన్నా అని, ఆలోచించి ఓటువేయ కుంటే ఐక్యత సున్నా అని,  మనందరం ముందు తరాలకు ఆదర్శంగుండాలని అయన కోరారు.

ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదని సోషల్ మీడియా లో చక్కర్లు

Image
 ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదని సోషల్ మీడియా లో చక్కర్లు  మేము ఒటరు అయిడెంటిటి కార్డులు ఇస్తామని ఆర్యవైశ్య మహాసభ పాత  కార్యవర్గం లెటర్ హెడ్ తో  ఫోటోలు పంపమని కోరుతూ  సోషల్ మీడియాలో పోస్ట్ లేదు అలా ఇవ్వడానికి వీలుండదని మరో పోస్ట్ ఆర్యవైశ్య మహాసభ  ఎన్నికల నోటిఫికేషన్ జారి అయిన తరువాత రాష్ట్ర కార్యవర్గం రద్దయిపోతుంది అందరూ గమనించండి అంటూ సోషల్  మీడియా లో చక్కర్లు కొడుతున్న మరో పోస్టు. ఎన్నికల నోటిఫికేషన్ జారి అయిన తరువాత రాష్ట్ర కార్యవర్గం రద్దయిపోతుంది. మనందరికి తెలిసిందే, వోటర్ లిస్టు విడుదల అన్నింటిలో ఎన్నికల అధికారికి సర్వాధికారాలుంటయి. అలాంటప్పుడు ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదు.  1. వోటర్లను ప్రలభపెట్టే ప్రయత్నం 2. కొత్త చర్చకు తెరలెపడం 3. కౌన్సిల్ సభ్యులు కానివాళ్ళను పూర్తిగ నిరుత్సహ పరచడం కాబట్టి ఇట్టి ప్రకటనమై రేపు చట్టపరమైన చర్యలు తీసుకునే విదంగా సంబదిత అదికారులకు వైశ్య పెద్దలు తెలియజేస్తారని తెలిపారు. కాబట్టి ఈలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను అందరు గమనించగలరని విజ్...

టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్ ల సేవలు*

 * టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్ ల సేవలు* * దెబ్బతిన్న కన్వర్ కు మరమ్మత్తులు* * వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు స్వస్తి* * నేడు ఉదయం నుండి సంఘటన స్థలంలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి* * మంత్రి కోమటిరెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం*  *దోమల పెంట, ఫిబ్రవరి 24*:   SLBC దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్ లో తనికీలు నిర్వహించాయి. వీరి బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాకండ్ లో జరిగిన విపత్తులలో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషనలను సమర్థవంతంగా నిర్వహించాయి. వీరితోపాటు 14 మంది ర్యాట్ ( ర్యాట్ హోల్ టీమ్)మైనర్స్ ల సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. వీరితోపాటు , టన్నెల్ లో ఉన్న వారి ఆచూకి తెలుసుకునేందుకు స్నిప్పర్ డాగ్స్ లను కూడా రప్పించా...

ACB కి పట్టుబడ్డ GHMC బిల్ కలెక్టర్

Image
  HYD: ACB రైడ్స్ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ హైదరాబాద్లో ACB అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. సోమవారం GHMC రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రైడ్స్ చేశారు. ACB వివరాలు.. బిల్ కలెక్టర్ మధు ఓ పరిశ్రమకు సంబంధించి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్ ద్వారా రూ. 45,000 తీసుకుంటూ మధు పట్టుబడ్డాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని ACB సూచించింది.

ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా రాగిఫణి హనుమాన్, మోహన్ సాయి.

Image
 *ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా రాగిఫణి హనుమాన్, మోహన్ సాయి.* నల్లగొండ, గూఢచారి:  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ABVP రాష్ట్ర అధ్యక్షులు నక్కల జానారెడ్డి  నూతన కమిటీని ప్రకటించడం జరిగింది.*యూనివర్సిటీ అధ్యక్షనిగా (పీజీ మ్యాథమెటిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న) రాగిఫణి హనుమాన్ చారి, మరియు కార్యదర్శిగా (ఐఎంబిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న)మోహన్ సాయి* ను ఎన్నుకున్నారు.వారు మాట్లాడుతూ ABVP యొక్క పనిని యూనివర్సిటీలో మరింత పెంచి,యూనివర్సిటీ లో నెలకొని ఉన్న విద్యారంగా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేస్తామని అన్నారు.మాపై నమ్మకం ఉంచి ఈ ఎన్నికకు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈనెల 27న వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం.

@ ఈనెల 27న వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం.  @ 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్  @ ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 వ సెక్షన్ అమలు @ బల్క్ ఎస్ఎంఎస్ లు పంపడం నిషేధం. @ పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు,ఇతరులు ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి  @ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు- వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,నల్గొండ జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి.      ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ )అమలులో ఉంటుందని వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.          సైలెన్స్ పీరియడ్ లో భాగంగా 25.02.2025 (మంగళవారం) సాయంత్రం 4.00 గంటల నుండి 27.02.2025 (గురువారం) సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షి...

ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

  ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.... నాగర్ కర్నూల్ :  కామెంట్స్.... ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం..... వారు సురక్షితంగా రావాలని శ్రీశైలం మల్లన్న ను ప్రార్థిస్తున్నా.... ఉత్తరా ఖండ్ లో ఓసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది... 17 రోజుల తర్వాత వాళ్ళని సురక్షితంగా బయటికి తీశారు, ఆ బృందం ఇప్పుడు రెస్క్యులో పాల్గొంది,అందుకే వారంతా సేఫ్ గా వస్తారని మా చిన్న ఆశ.... ప్రమాదం విషయంలో కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలి... బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి... ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని అయినా పరామర్శించారా ? ఫాం హౌస్ దాటి బయటకు వచ్చారా ? రేవంత్ టన్నెల్ వద్దకు వస్తె సెక్యూరిటీ ప్రాబ్లం మరియు సహాయక చర్యలకు ఆటంకం,అందుకే మా మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము.... అవసరమైతే ఆధునిక టెక్నాలజీ వాడేందుకు ప్రపంచంలో పేరున్న సంస్థలను సంప్రదిస్తున్నామ్...

అమరవాది లక్ష్మీనారాయణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Image
అమరవాది లక్ష్మీనారాయణపై  పోలీసులకు ఫిర్యాదు  *ఆర్యవైశ్యుడై ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలి*  👉 11 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలి  👉 30 లక్షల మంది ఆర్యవైశ్యుల్లో 1000 మంది ఓటర్లతో గెలిచే గెలుపు గెలుపేనా...?? 👉 అమరవాది లక్ష్మీనారాయణతో ఆర్యవైశ్యులు ఎంతో నష్టపోయారు  👉 సూర్యాపేట పోలీస్ స్టేషన్లో లక్ష్మినారాయణపై ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు  సూర్యాపేట,  ఆర్యవైశ్యుడై ఉండి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొంతమంది ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలని జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఇమ్మడి సోమ నరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 13న సూర్యాపేట జిల...

సెట్విన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ

Image
  సెట్విన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ నల్లగొండ : (gudachari) :  నల్లగొండలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వయం ఉపాధి కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ కో-ఆ ర్డినేటర్ ఎం. సరిత తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఎడ్యుకేషన్ కోర్సులు, కంప్యూ టర్ బేసిక్స్, పీజీడీసీఏ, డీటీపీ కోర్సుల్లో శిక్షణ నిస్తామని పేర్కొన్నారు.  విద్యార్థినులు, యువ తులకు కంప్యూటర్, బ్యూటీషియన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్స్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర 26 రకాల కోర్సుల్లో శిక్ష ణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 24 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ఈ కోర్సులు పూర్తి చేశాక జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు.  వివరాలకు 9705041789 ఫోన్ నంబర్ను సంప్రదిం చాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్

Image
  *BREAKING* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్  నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని  జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీ కి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి  సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపిన సీఎం  సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించిన సీఎం  సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆరెఫ్ టీం ను పంపిస్తామని సీఎంకు చెప్పిన ప్రధాని మోడీ పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ

పొల్యూషన్ కంట్రోల్ క్విజ్

Image
  పొల్యూషన్ కంట్రోల్ క్విజ్  హైదరాబాద్, 22/02/2025  ( గూఢచారి) ఎలన్ & ఇవిషన్ IIT,  తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు కలిసి, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యం గురించి అవగాహన పెంచేందుకు మరియు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ క్విజ్ IIT కంది లో నిర్వహించారు. ఈ క్విజ్‌కు TGPCB ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వరరావు హాజరయ్యారు.   క్విజ్‌కు ముందు, ఆర్గనైజింగ్ టీం మరియు పాల్గొనేవారితో కలిసి పర్యావరణాన్ని రక్షించేందుకు ఒక ప్రమాణం చదివారు. అనంతరం, నాగేశ్వరరావు ఇ-వేస్ట్ నిర్వహణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత 3 రౌండ్స్ ఉన్న క్విజ్ జరిగింది, ఇది పాల్గొనేవారిని ఛాలెంజ్ చేసి, పర్యావరణం గురించి విద్యను ఇచ్చింది.  

తల్లిద్రండులు లేని అమ్మాయి పెళ్లి కి అండగా ఉప్పల

Image
 *తల్లిద్రండులు లేని అమ్మాయి పెళ్లి కి అండగా ఉప్పల* ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో..ఉప్పల శ్రీనివాస్ గుప్త  క్యాంపు కార్యాలయంలో బీరప్ప గడ్డ ఉప్పల్ కి చెందిన ( పద్మశాలి) సామాజిక వర్గం శ్రీ వాణీ వివాహం కోసం పుస్తె, మెట్టెలు, చీర,గాజులు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ , అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  IVF First మహిళ ఉప్పల స్వప్న అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన ఫౌండేషన్ ద్వారా కుల, మత భేదాలకు అతీతంగా 8 వేల మందికి పైగా అనేక పేద మరియు అగ్రవర్ణ పేదల అమ్మాయిల వివాహానికి పూస్తే మట్టెలు, చీర , గాజులు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు . శ్యామ్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

Image
  , నల్గొండ ,  21.2.2025        హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చిన్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశాలలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.        శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేయాలని అన్నారు .ఎక్కడైనా రెస్టారెంట్లు, హోటల్లు బడ్డీ కోట్లు, తోపుడు బండ్లు వారు వాడిన నూనెలను తిరిగి వాడడం ,అలాగే కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడటం వంటివి చేయకుండా తరచూ దాడులు నిర్వహించాలని, ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే సీజ్ చేయడమే కాకుండా, కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ ఇప్పటివరకు  అభద్రత ఆహార పదార్థాలను వినియోగించినందుకుగాను నల్గొండ జిల్లాలో 16 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా కలె...

భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పురందేశ్వరి

Image
 భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పురందేశ్వరి తెలంగాణ గాంధీగా ప్రసిద్ధి _చెందిన_ భూపతి కృష్ణమూర్తి గారి 99 వ జయంతి శుక్రవారం రోజున కరీంనగర్  వైశ్యభవన్ లో ఏర్పాటుచేసిన సమావేశమును ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ఎంపీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు మాట్లాడుతూ భూపతి కృష్ణమూర్తి గారి శతజయంతి వేడుకలు తమ చేతుల మీదుగా ప్రారంభించుట అదృష్టంగా భావిస్తూ ఆ మహానీయునికి పుష్పాంజలి ఘటించారు .భూపతి కృష్ణమూర్తి స్మారక కమిటీ ప్రతినిధి ఉప్పల రామేశం మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధేయ వాది, 1946 సంవత్సరంలో మహాత్మా గాంధీతో వారద సేవాశ్రమంలో పది రోజులు ఉన్నారని దండియాత్రలో పాల్గొని జైలు శిక్షలు, 1947 ,48 కాలంలో నిజాం రజాకారులను ఎదిరించి కొన్ని సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారని తెలియజేశారు, 1967 నుండి 72 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు, 2000 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు పాల్గొని జైలు శిక్ష అనుభవించారని తెలియజేశారు, ముల్కనూర్ కోపరేటివ్ సొసైటీ వ్యవస...

జిల్లా అధ్యక్షుడి పోస్ట్ చాల కాస్ట్లి గురూ?

Image
 జిల్లా అధ్యక్షుడి పోస్ట్ చాల  కాస్ట్లి గురూ? హైద్రాబాద్: ఆర్యవైశ్యుల ఐక్యతకు, బీద వారికి సేవ చేయడానికి, హక్కులు కాపాడడానికి, రాజకీయంగా కమ్యూనిటీ వ్యక్తులకు ప్రాధాన్యత పెంచడానికి ఏర్పడ్డ సంఘాలు చివరకు బేర సారాలకు నిలయంగా మారింది. 20 లక్షలు ఇస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భోనగిరి జిల్లా అధ్యక్ష పదవి యిప్పిస్తానని ఒక యువజన నాయకుడు ఓ జిల్లా నాయకుడితో బేరసారాలకు దిగినట్లు తెలుస్తుంది. 20లక్షలు ఇచ్చుక్కోలేనని అని అంటూ నాకు ఆ పోస్ట్ అక్కరలేదన్న ఆ జిల్లా నాయకుడు.  జిల్లా లోని అభివృద్ధి కార్యక్రమాలకు అని కొందరు, కాదు కాదని కొందరు  డిస్కస్ చేసుకుంటున్నారు.

అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్

*అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్* GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్‌, సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వేరే మహిళతో ఉన్న సమయంలో భార్య కళ్యాణి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.   కోపంతో  భార్య ఇద్దరినీ చితకబాదిన అనంతరం, పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించింది.

నేడు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి. 99 వ జయంతి

Image
 తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి. 99 వ జయంతి 21 ఫిబ్రవరి 2025 ( శత జయంతి మహోత్సవ సం వత్సరము 21 ఫిబ్రవరి 2026)  తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి 21 ఫిబ్రవరి 1926 లో ములుకనూరు లో జన్మించారు అమ్మమ్మ గారు వరంగల్ చెందిన ప్రముఖ చందా కాంతయ్య కుటింబీకులు వారసత్వం గా వచ్చిన అడితి వ్యాపారం వరంగల్ లోని గ్రేన్మార్కెట్ లో నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ భావాలకు ఆకర్షటిడై 1943 లో వరంగల్ లో నేషనల్ క్లబ్ స్థాపించారు ఆంధ్ర మహాసభ తో సంబంధం 1941-46 వరకు వరంగల్ పట్టణ కాంగ్రెస్ కోశాధికారి గా సేవలు 1946 లో ఖాదీ ప్రకాష్ సభ్యులు గా ఎన్నిక 1944 లో గాంధీ జన్మదినం (అక్టోబర్ 2) వార్దా సేవాస్రం లో పది రోజులు గాంధీ గారితో ఉన్నారు ఆగస్టు 11,1946 లో హయాగ్రీవాచారీ తో కలిసి జాతీయ జండా ఎగురా వేసి రజాకార్లతో దాడి దెబ్బలు 1947-48 తెలంగాణ విమోచన ఉద్యమం లో అజ్ఞాతా జీవితం 1968-71 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జైలు జీవితం 1972 రాష్ట్రము లోని ప్రజాసంఘాలు ఆయనకు తెలంగాణ గాంధీ అనే బిరుదు వరంగల్ పబ్లిక్ గార్డెన్ లో ప్రదానం జాతీయ ఉద్యమం [ స్వాతంత్ర ఉద్యమం ) దండి యాత్ర తెలంగాణ ఉద్యమం పలు మార్లు జైయిల్ దాదాపు 500 ఎకరాలు భూమ...

మహాసభ ఎన్నికలు సజావుగా జరగాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి*

Image
 *మహాసభ ఎన్నికలు సజావుగా జరగాలి* *హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు* 👉 *బేగంపేటలోని ఒక దారికి రోశయ్య మార్గ్ గా నామకరణం* 👉 *వెంటనే చర్యల కై అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి* 👉 *సీఎంని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసిన ఆర్యవైశ్య ప్రముఖులు* హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంఓ ఓ ఎస్ డి శేషాద్రిని ఆదేశించారు.  ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు మిగతా సంఘాల ఎన్నికలకు ఆదర్శంగా ఉండాలి. అందుకు అధికారికంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను చట్ట రీత్యా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  అలాగే తను కల్వకుర్తి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్య వైశ్యుల ముద్దు బిడ్డ రోశయ్య విగ్రహాన్ని హైదరాబాదులోని ఆయన ఇంటికి సమీపంలో గల ప్రకృతి చికిత్స ఆలయంలో ఏర్పాటు మరియు దానికి రోశయ్య  నామకరణం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.  అపర తెలంగాణ ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల పైన హైకోర్టులో writ పిటిషన్ దాఖలు

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల పైన హైకోర్టులో writ పిటిషన్ దాఖలు హైద్రాబాద్:  తెలంగాణ ఆర్యవైశ్య తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలపై హైకోర్టులో Writ petition WP 4612/2025 గా దాఖలయింది. సొసైటీల ప్రిన్సిపల్ సెక్రెటరీ, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ హైద్రాబాద్, మాజీ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ మరియు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ లను ప్రతివాదులుగా చేస్తూ చకిలం రమణయ్య, బచ్చు శ్రీనివాస్ హైద్రాబాద్ గార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రిజిస్ట్రేషన్ నెంబర్ 363 /2015 యొక్క ఎన్నికలు తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ  రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ ద్వారా  సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం బై లా ను సరిచేసి ఎన్నికలు నిర్వహించి, గత 2015 నుండి అన్ని  ఆర్థిక పరమైన అకౌంట్స్ ఆడిట్ చేయించి  కొత్త పాలక వర్గానికి అప్పగించాలని రిట్ ఆఫ్ మాండమాస్ కోరారు మరియు  ఇంటీరియమ్ స్టే ఇవ్వమని కోరారు. ఈ కేసు రేపు 20 వ తే...

కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహాసభ ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి

Image
  కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహాసభ ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి హైద్రాబాద్: ప్రణవ్ మునిగెల, అడ్వొకేట్ తేది 17-2-2025 రోజున ఎ.వెంకటేశం, s/0. లక్ష్మీనారాయణ, షాద్ నగర్ వారు 3 వ అడీషనల్ చీఫ్ జడ్జ్, సిటి సివిల్ కోర్టు, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ గురించి కేసు I.A.253 of 2025 In O.O.P. No.6 of 2025 వేసినాడని, అట్టి కేసులో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసినదని, ఆ ఉత్తర్వులు కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఉన్నాయని, సదరు ఉత్తర్వుల కాపీని మాకు ఈరోజు అందజేసి, ఇట్టి ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచాలని కోరినందున, మేము ఇట్టి ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినాము. తదుపరి ప్రక్రియ తెలియజేయగలమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల తోడుపునూరి చంద్రపాల్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి స్టేటస్కో కాపీ ని అందచేసిన ఆ.వెంకటేశం

Image
 తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి స్టేటస్కో కాపీ ని అందచేసిన ఆ.వెంకటేశం హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు స్టేటస్కో కాపీ ని ఈరోజు ఉదయం తెలంగాణ ఆర్యవైశ్యమ హాసభ హైదరాబాద్ లోని చింతల బస్తీ కార్యాలయం లో ఎన్నికల అధికారి చంద్రపాల్ కు అందజేసిన కోర్టులో  పిటిషన్ వేసిన వెంకటేశం.

మహాసభ లో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన A టీమ్ అప్రజాస్వామిక పోకడలకు చెంపపెట్టు.

Image
 మహాసభ లో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన A టీమ్ అప్రజాస్వామిక పోకడలకు చెంపపెట్టు. హైద్రాబాద్: మొదటి నుండి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విషయంలో అప్రజాస్వామ్యం తాండవించింది. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం నెగ్గుతుందని ఈ కోర్టు జోక్యాలే  సాక్ష్యం. ఈ విషయం తో ఇప్పటికైనా A టీం కు జ్ఞానోదయం కావాలి. బడా నాయకులందరూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించేందుకు అన్ని కోర్టు కేసులు రద్దు జరిగేలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా పునుకుంటే బాగుంటుందని పలువురు ఆర్యవైశ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ప్రకటించిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు ఎన్నికలు ల్లో నలుగురు నామినేషన్ వేశారు. అందులో ఒకరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు స్టే వచ్చింది. ఆయన నేనే అధ్యక్షుడిని అని ప్రకటింప చేసుకొని 9 మందితో తెలంగాణ ఆర్యవైశ్య A టీమ్ నాయకుడు మహాసభ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని మేమే తెలంగాణ ఆర్యవైశ్యులు లకు హక్కుదారులమంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లో ఉన్న ఎఫ్డీలు పంచుకున్నారు. అంతేకాకుండా వైశ్య భవన్ కూడా పార్టిషన్ ఈ సొసైటీ పేరుతోనే చేసుకున్నారు. ...

IVF & WAM గురించి మహాసభ ఎలక్షన్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులు*

Image
  *మహాసభ ఎలక్షన్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులు* ఐవిఎఫ్ మరియు వామ్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు. వెంటనే క్లాస్ 3 ( IVF మరియు WAM అనర్హతకు సంబంధించి) తొలిగించి తగు నిర్ణయం తీసుకోవాల్సింది గా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ EC. మెంబర్ మరియు  ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మహాసభ అధ్యక్షులు గట్టు మహేష్ బాబు గారు క్లాస్ 3 కి వ్యతిరేకంగా వేసిన  రిట్ పిటిషన్( IVF మరియు WAM లో పదవులు అనుభవిస్తున్న వ్యక్తులకు మహా సభ ఎలక్షన్ లో పోటీ చేయుటకు అనర్హత) సంబంధించి హైకోర్టు ఈరోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేస్తూ సదరు వ్యక్తులకు పోటీ చేసే అవకాశం ఇచ్చి అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!

Image
  ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్! రిటర్నింగ్ అధికారికి హై కోర్టు నోటీసులు! ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుల మొట్టికాయలు ఫిబ్రవరి 8నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను తాత్కాలిక నిలిపివేత మార్చి 4 వరకు స్టేటస్ కో ఈ పిటిషన్లపై మార్చి 21న విచారణ హైద్రాబాద్, గూఢచారి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలపై కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి తదనుగుణంగా తీర్పుల నిచ్చాయి. ఏ వెంకటేశం అనే వ్యక్తి హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు చీఫ్ జడ్జి – 2 మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియపై స్టేటస్కో విధిస్తూ యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. మహాసభ ఎన్నికల కోసం ఈనెల 8వ తేదీన విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. మార్చి 4వ తేదీ వరకు స్టేటస్కు కొనసాగుతుందని ఆదేశించారు. మహాసభ అధ్యక్ష ఎన్నిక కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలన్న అభ్యర్థులతో పాటు తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.

ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు

Image
 ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు హైద్రాబాద్ :  ఎన్నికల అధికారి ప్రకటించిన వివరాలు ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు. ఈరోజు నాగర్ కర్నూలు వాస్తవ్యులు, అడ్వొకేట్ అయిన శ్రీ ఎ.బంగారయ్య గారు లిఖితపూర్వకంగా మరియు నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ IA 39 of 2025 in EOP No. 1/2025 జత చేసి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయుటకు అర్హుడు కాడని మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరగనందున మహాసభ నియమావళి 11 (డి) ప్రకారం అతనికి మరియు నాగర్ కర్నూలు జిల్లాలోని ఇతర సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని తెలియజేస్తూ, శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారి నామినేషన్ ను పరిగణన లోకి తీసుకోకూడదని మరియు తిరస్కరించవలెనని ఆయన ఆక్షేపణ తెలుపుతూ, దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవలసినదిగా కోరిన దృష్ట్యా, ఇట్టి విషయాన్ని మేము ప్యానెల్ ఆఫ్ అడ్వొకేట్స్తో సంప్రదించి నిర్ణయం ప్రకటించడం జరుగుతుం ది.

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సుజేంద్ర శెట్టి నామినేషన్

Image
 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సుజేంద్ర శెట్టి నామినేషన్*  *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికలలో భాగంగా ఈరోజు హైద్రాబాద్ లోని ఆర్యవైశ్య మహాసభ భవనంలో నారాయణపేట జిల్లా ఆర్య వైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు కె సుజేంద్ర శెట్టి గారు ఎన్నికల అధికారి తొడుపునురీ చంద్రపాల్ గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీకి నామినేషన్ పత్రాలను అందజేశారు* *ఈ కార్యక్రమంలో మన జిల్లానాయకులు*  *కల్వ శ్రీనివాసులు, పూరి వెంకటేష్, కె రవీందర్, పి రమేష్. పీ బస్వరాజ్ , పొగాకు సింహచలం* గార్లు పాల్గొన్నారు

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన హైద్రాబాద్ :    చతికిల పడిపోయిన మహాసభ ను ప్రాణం పొసి పూర్వవైభవం తేవడానికి అమరవాదికి వ్యతిరేకంగా ఆర్యవైశ్య మహామహులు  గంజి రాజమౌళి గుప్త, కాల్వ సుజాత, , బొగ్గరపు దయానంద్, కోలేటి దామోదర్, మొగలపెల్లి ఉపేందర్, ప్రేమ్ గాంధీ, చకిలం  రమణయ్య, మరియు వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు అభిమానులు పెద్దఎత్తున మహాసభ అభ్యర్థి శ్యాంసుందర్ కి మద్దతుగా తరలివచ్చినారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కు ఏర్పాట్లు - ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కు ఏర్పాట్లు - ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని, ఈ రోజు నామినేషన్లు స్వీకరిస్తున్నమని ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ తెలిపారు. ఈరోజు 3 గంటల వరకు నామినేషన్లు సేకరిస్తామని ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్ల ఫారాలు  తీసుకున్నారని అయన తెలిపారు. 

ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Image
  ఆర్యవైశ్య మహాసభ  ఎన్నికల్లో గెలుపు ఎవరిది? *ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్,  అదిలాబాద్ ల్లో మిడిదుడ్డికి* *ఉమ్మడి రంగారెడ్డి లో అమరవాదికి ఎడ్జ్* *హైద్రాబాద్ లో ఉన్న బస్తీ సంఘాలు అమరవాది పై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారమ్* * ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం మెదక్ లో 50:50* హైద్రాబాద్ ( గూఢచారి): తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు భారీ యెత్తున జరగడం ఇది మొదటిసారి. తెలంగాణ వచ్చిన 11సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నదున సహజంగానే ఆర్యవైశ్య కమ్యూనిటీ దృష్టి మొత్తం ఈ ఎన్నికలపై ఉన్నది. గత 11 సంవత్సరాల నుండి అధ్యక్షుడుగా చెలామణి అయిన అమరవాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదుడ్డి శ్యామ్ సుందర్ రంగం లో ఉంటున్నట్లు వారి ప్రచారం సరళి నీ బట్టి తెలుస్తుంది. ఇద్దరు కూడా ఈ నెల 17 న నామినేషన్లు వేస్తున్నాం ఆర్యవైశ్యులను భారీ ఎత్తున హాజరు కండి అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం చేసుకున్నారు మిడిదుడ్డి శ్యామ్ సుందర్ లకడికాపూల్ లోని వాసవి సేవకేందద్రానికి, అమరవాది లక్ష్మీనారాయణ కర్మాంఘట్ లక్ష్మి కన్వెన్షన్ కు రావాలని వైశ్యు లకు పిలుపున...

IVF & WAM సభ్యులకు మహాసభ ఎన్నికలో పోటీకి అనర్హత క్లాస్ 3 అంశాన్ని వెంటనే తొలిగిoచాలి లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి - IVF తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్

Image
  IVF & WAM సభ్యులకు మహాసభ ఎన్నికలో పోటీకి అనర్హత క్లాస్ 3 అంశాన్ని వెంటనే తొలిగిoచాలి లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి - IVF తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ హైద్రాబాద్:  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు WAM లో ఇంతకు ముందు పదువులు అనుభవించిన, ఇప్పుడు పదవి అనుభవిస్తున్న వ్యక్తులకు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ లో పేర్కొన్న పోటీ కి అనర్హత కి సంబంధించి క్లాస్ 3 అంశాన్ని పై IVF రాష్ట్ర యూత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.  నోటిఫికేషన్ లో క్లాసు 3 పోటీ కి అనర్హత కి సంబంధించి నిభందనలు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే క్లాస్ 3 అంశాన్ని తొలిగిoచడం లేదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఆర్య వైశ్య మహాసభ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తోడుపునూరి చంద్రపాల్ కు మరియు కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆఫీస్ లో వినతి పత్రం IVF రాష్ట్ర యూత్ వింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలతో కోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపింది. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని హ...

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ

Image
  వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ   హైద్రాబాద్: లేఖను యధాతదంగా చదవండి ఆర్య వైశ్య మహాసభ వైశ్య కుల పెద్దలు శ్రీ దన్ పాల్ సూర్య నారాయణ గారు MLA, శ్రీ బొగ్గారాపు దయానంద్ MLC గారు మాజీ MLA శ్రీ బిగ్గాలా గణేష్ గుప్తా గారు  వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు  పోలీస్ హోసింగ్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ బొల్లం సంపత్ గారు మాజీ చైర్మన్ సోమా భారత్ గారు మాజీ భగీరత చైర్మన్ వెంకటేష్ గారు ఇంకా ఆర్యా వైశ్య ప్రముఖులు మీరు తక్షణమే మహాసభ లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిబద్దతతో నియామవలి ప్రకారం జరిగే విధంగా మార్పుకు శ్రీ కారం చుట్టండి చొరవ తీసుకోవాలి  మీరు సమావేశం ఏర్పాటు చేసి మహాసభ లో తగు జాగ్రత లు అవకతవకలు సమీక్షించి వైష్యులకు న్యాయం చేయండి  ఓటర్ లిస్ట్ ఎవ్వరికి తెలియదు  ఇంకా లిస్ట్ లో అనుకూల వ్యక్తులను మారుస్తు ఉన్నారు అని తెలుస్తుంది కొందరు కోర్ట్ కు వెళ్లారు అని తెలుస్తుంది  ఒక్కటి కాదు చాలా విషయాలు మీరు పెద...

మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా

Image
 మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా  హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీరు ఓటు వేసే ముందు ఆలోచించవలసిందిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు మీ ఒక్కరిది కాదని 200 మంది సభ్యులు ఓటు వేస్తున్నారని మీరు రాష్ట్ర ఆర్యవైశ్య నిరుపేద ఆదుకునేవారు సమర్ధుడు రాజకీయంగా మనల్ని ముందుకు నడిపేవాడు ఎవరైతే ఉంటారో వారికి ఆలోచించి ఓటు వెయ్యమని సూచన చేసారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిరుపేద ఆర్యవైశ్యులను గుర్తుపెట్టుకుని మీ ఓటు సమర్థులైన వారికి ఓటు వేయాలని కోరారు.

50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....

Image
*గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు....* 50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి.... ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు   75 వేల రూపాయలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి.... ముందు 25 వేల రూపాయలు తీసుకున్న ADE.... ఈరోజు మిగతా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు ADE సతీష్ రెడ్డి....  

రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల..

Image
 తూర్పుగోదావరి జిల్లా  సీతానగరం మండలం మిర్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం.. రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు.. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలెర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైకుల ద్వారా ప్రజలను అలెర్ట్ చేస్తున్న అధికారులు.. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలుతో జరుగుతున్న పర్యవేక్షణ.. గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ, శానిటేషన్ పనులు చేస్తున్న అధికారులు.. ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు చెబుతున్న కొంతమంది కోళ్ల ఫారం యజమానులు.. మిర్తిపాడు గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్  కూడా అమలులో ఉండడంతో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు..

అవగాహన కల్పించేందుకుగాను మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
  నల్గొండ:     ప్రజలలో అవగాహన కల్పించేందుకుగాను ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.      బుధవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు .    అనంతరం మాట్లాడుతూ కలెక్టరేట్లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లు బాగుందని, ఇదేవిధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలలో ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను ఇలాంటి మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని చెప్పారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒకటి.     జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ,సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

రంగరాజన్ పై దాడి కేసులో చంచల్ గూడ జైలు లో ఉన్న వీర రాఘవరెడ్డి ని పరామర్శించిన ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్

Image
  రంగరాజన్ పై దాడి కేసులో చంచల్ గూడ జైలు లో ఉన్న వీర రాఘవరెడ్డి ని పరామర్శించిన ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్ హైద్రాబాద్ :  చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీర రాఘవరెడ్డిని... చంచల్ గూడ జైలు లో ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్ కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేఎన్ సాయికుమార్ మాట్లాడుతూ నేను వీర రాఘవరెడ్డిని పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశానని రాఘవరెడ్డి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. వీర రాఘవరెడ్డి పై నమోదు చేసిన కేసు ఒక బూటకం అని, రాఘవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాను రంగరాజన్ పై ఎటువంటి దాడి చేయలేదని కనీసం చేయి కూడా లేపలేదని కేవలం ఒక విషయమే చర్చించేందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లాలని, రామరాజ్యం తరపున అర్చకులు చేయవలసిన విధివిధానాలను, భక్తులకు ఉపదేశించవలసిన వివరాల గురించి మాత్రమే చర్చించానని రాఘవరెడ్డి తెలిపినట్లు సాయికుమార్ వెల్లడించారు...

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Image
  • నేడు  నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. • ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి  09.30 గంటలకు నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, గోపలాయిపల్లి గ్రామం చేరుకొని.. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. * అనంతరం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం చేరుకొని ఇటీవల అనారోగ్యంతో కాలం చేసిన మాజీ సర్పంచ్ కీ.శే. రాజిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. • తిరిగి మధ్యాహ్నం 01.30 గంటలకు మామిడాల గ్రామం నుంచి బయలుదేరి మ. 03.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

చండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
 *చండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి*  నల్గొండ: గూఢచారి: చండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అందరూ డ్యూటీలో ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గర్భిణీ మహిళలు, బాలింతలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లుగా గుర్తించారు. డాక్టర్ ద్వారా ప్రతిపాదనలు తీసుకొని త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆస్పత్రి కి నూతన భవనం ఏర్పాటు ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఉందన్నారు. ఇప్పటికే మంజూరు అయిందని తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపే చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఆర్డీవో శ్రీదేవి తహసిల్దార్ దశరథ, వైద్యాధికారి డాక్టర్ రాజు తదితరులు ఉన్నారు.