ఈనెల 27న వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం.
@ ఈనెల 27న వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం.
@ 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్
@ ఎన్నికలు పూర్తయ్యే వరకు
144 వ సెక్షన్ అమలు
@ బల్క్ ఎస్ఎంఎస్ లు పంపడం నిషేధం.
@ పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు,ఇతరులు ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి
@ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు- వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,నల్గొండ జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి.
ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ )అమలులో ఉంటుందని వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
సైలెన్స్ పీరియడ్ లో భాగంగా 25.02.2025 (మంగళవారం) సాయంత్రం 4.00 గంటల నుండి 27.02.2025 (గురువారం)
సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం జరిగిందని పేర్కొన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని సైలెన్స్ పిరియడ్ లో ఎవరు రాజకీయపరమైన ఎస్.ఎం.ఎస్ లు, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపకూడదని, బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, ప్రచారం చేయరాదని కలెక్టర్ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. సైలెన్స్ పీరియడ్ లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 ప్రకారం జారీ చేయబడిన సూచనలు,ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లా యేతర వ్యక్తులు ఎవరు జిల్లాలో ఉండవద్దని స్పష్టం చేశారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1)(బి) ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని వెల్లడించారు.
అలాగే మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి గురువారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలపై సేదం ఉంటుందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించే మార్చి 3 న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించే ఆయా జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, రిటర్నింగ్ అధికారి ప్రకటన లో వెల్లడించారు.
Comments
Post a Comment