ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా రాగిఫణి హనుమాన్, మోహన్ సాయి.
*ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా రాగిఫణి హనుమాన్, మోహన్ సాయి.*
నల్లగొండ, గూఢచారి:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ABVP రాష్ట్ర అధ్యక్షులు నక్కల జానారెడ్డి నూతన కమిటీని ప్రకటించడం జరిగింది.*యూనివర్సిటీ అధ్యక్షనిగా (పీజీ మ్యాథమెటిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న) రాగిఫణి హనుమాన్ చారి, మరియు కార్యదర్శిగా (ఐఎంబిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న)మోహన్ సాయి* ను ఎన్నుకున్నారు.వారు మాట్లాడుతూ ABVP యొక్క పనిని యూనివర్సిటీలో మరింత పెంచి,యూనివర్సిటీ లో నెలకొని ఉన్న విద్యారంగా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేస్తామని అన్నారు.మాపై నమ్మకం ఉంచి ఈ ఎన్నికకు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment