వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి




     వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.


     సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు.


     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని ,ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ,ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు .


      ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, నల్గొండ రెవిన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.


     నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయినా లేదా క్లరికల్ సమస్యలకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం పాటించాల్సిన నియమ నిబంధనలన్నిటిని అభ్యర్థులు , రాజకీయ పార్టీలు, తప్పకుండా పాటించాలని కోరారు. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలు అన్నింటిని తెలుసుకునేందుకు తనతో పాటు, అదనపు కలెక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా అభ్యర్థుల అఫిడవిట్ సమర్పణ, అన్నేక్సర్ 26, ఫోటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.

     ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో పాటించాల్సిన నిబంధనాలను నిర్ధారించడం జరిగిందని ,రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ,అందరూ ఈ నిబంధనలను పాటించాల్సిందిగా ఆమె కోరారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ముసాయిదా జాబితా ప్రకారం 24905 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు నల్గొండ సమీపంలోని అర్జాల బావి వద్ద ఉన్న మార్కెటింగ్ గోదాంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఆమె తెలిపారు.

    అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్