తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల పైన హైకోర్టులో writ పిటిషన్ దాఖలు
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల పైన హైకోర్టులో writ పిటిషన్ దాఖలు
హైద్రాబాద్:
తెలంగాణ ఆర్యవైశ్య తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలపై హైకోర్టులో Writ petition WP 4612/2025 గా దాఖలయింది. సొసైటీల ప్రిన్సిపల్ సెక్రెటరీ, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ హైద్రాబాద్, మాజీ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ మరియు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ లను ప్రతివాదులుగా చేస్తూ చకిలం రమణయ్య, బచ్చు శ్రీనివాస్ హైద్రాబాద్ గార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రిజిస్ట్రేషన్ నెంబర్ 363 /2015 యొక్క ఎన్నికలు తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ ద్వారా సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం బై లా ను సరిచేసి ఎన్నికలు నిర్వహించి, గత 2015 నుండి అన్ని ఆర్థిక పరమైన అకౌంట్స్ ఆడిట్ చేయించి కొత్త పాలక వర్గానికి అప్పగించాలని రిట్ ఆఫ్ మాండమాస్ కోరారు మరియు ఇంటీరియమ్ స్టే ఇవ్వమని కోరారు. ఈ కేసు రేపు 20 వ తేదిన హియరింగ్ ఉన్నది. ఈ కేసును ప్రముఖ హై కోర్టు సీనియర్ అడ్వకేటు సి. రఘు పిటిషనర్ ల తరపున వాదిస్తున్నారు.
ఈ క్రింద పిటిషన్ యధాతధంగా ఇస్తున్నాము ఓపెన్ చేసి చదవవచ్చు.
Comments
Post a Comment