Posts

మోతే లో ఘనంగా పండిత్ దిన్ దయల్ ఉపాధ్యాయ్ జయంతి

Image
మోతే మండలం లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పండిత్ దిన్ దయల్ ఉపాధ్యాయ్  జయంతి వేడుకలను నాయకులు నిర్వహించారు ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంఛార్జి నకిరికంటి జగన్ మోహన్ రావు పాల్గొని ఇట్టి ఈ జయంతి వేడుకలను ప్రారంభించారు అనంతరం దిన్ దయాళ్  చిత్ర పటానికి ఆయన నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అమర్ హై నినాదాలు చేసారు  కాగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  అతని జీవితమే ఈనాటి యువతకు ఒక ప్రేరణ, ఆదర్శం అన్నారు ఉత్తరపరదేశ్ లోని కుగ్రామంలో జన్మించి, చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగిందని తెలిపారు ఆయన ముక్కవంచని దీక్షతో పై చదువులు చదివాడని చెప్పారు  దయాల్  చిన్నప్పటి నుండి దేశం కోసం సేవ చేయాలనే తపనతో, తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సహితం వదిలేసి, ప్రజా సేవకు అకింతం అయ్యాడని అన్నారు  ఈ    కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్ర సత్యనారయణ రెడ్డి,నాయకులు  ఉప్పల రామచంద్రయ్య,బొంత వెంకటేశ్వర్లు అంగోతు శంకర్ నాయక్, బొమ్మనపల్లి వెంకన్న, ధారవత్ నీలమ్మ , అంగోత్ రమేష్ కార్యకర్తలు అభిమానులు గ్రామస్థులు తదతరులు పాల్గొన్నారు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు

Image
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు ర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉపయోగించేందుకు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్,జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో ఈ.వి.యం.గోడౌన్ లు తెరచి సూర్యా పేట జిల్లా హుజుర్ నియోజక వర్గ ఉప ఎన్నిక లకు సూర్యా పేట జిల్లా నుండి వచ్చిన అధికారులకు అప్పగించి తరలించారు. బెల్ కంపెనీ తయారు చేసిన  530 బ్యాలెట్ యూనిట్ లు,408 కంట్రోల్ యూనిట్ లు,438 వి.వి. ప్యాట్ లు ఇటీవల నల్గొండ పార్లమెంట్ నియజకవర్గ ఎన్నికల్లో వినియోగించిన వాటిని హుజూర్ నగర్ కు పంపిస్తున్నారు. ఈ.వి యం గోడౌన్ తెరచి హుజూర్ నగర్ కు తరలించే కార్యక్రమంలో టి. డీ.పి.జిల్లా కార్యదర్శి ఎం. ఏ.రఫీ,పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, టి.అర్.ఎస్.యూత్ ఇంఛార్జి జమాల్ ఖాద్రి,సి.పి. ఐ.నుండి పల్లా దేవేందర్ రెడ్డి,సి.పి.యం.నుండి నర్సి రెడ్డి లు, పశు సంవర్థక శాఖ ఏ. డి. శ్రీనివాస్,కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు చందన వదన,పరిపాలన అధికారి మోతి లాల్,ఎన్నికల డి.టి.విజయ్ లు పాల్గొన్నారు

క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణం

ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని చిదిమేసింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా శంషాబాద్‌ వద్ద పక్కనే ఉన్న ద్విచక్రవాహనాన్ని క్యాబ్  ఢీకొట్టింది. దీంతో కారు డోర్‌లో బైక్‌పై ఉన్న వ్యక్తి చొక్కా చిక్కుకుంది. ఇది గమనించని క్యాబ్‌ డ్రైవర్‌ కారును వేగంగా తీసుకెళ్లాడు. ద్విచక్రవాహనదారుడిని కారు ఆరు కిలోమీటర్ల లాక్కెళ్లింది. సుమారు ఆరు కి. మీ తర్వాత గమనించి చూడగా వాహనదారుడు ప్రాణాలను విడిచాడు. మృతదేహాన్ని, కారును వదిలి క్యాబ్‌ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దారుణ హత్య..

  హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాతు నగర్ లో ఓ యువకుడు దారుణ హత్య.. అర్థ రాత్రి హత్య చేసి పారిపోయిన వ్యక్తులు. ఫార్చ్యూన్ అనుపమ అపార్ట్మెంట్ పక్కన బండరాళ్లతో మోదీ హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. మర్డర్ అయిన యువకుడు లేనిన్ నగర్ కు చెందిన చంద్రకాంత్ (27)  పాత రౌడీషీటర్ గా గుర్తించిన మీర్పేట్ పోలీసులు. పాత కక్షలతో చంపారని అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నీట మునిగిన నాచారం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ మహేష్ భగవత్ ,

Image
నీట మునిగిన నాచారం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ మహేష్ భగవత్  https://youtu.be/92iDzxS5sAQ

TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు ఫలితం యొక్క తాత్కాలిక ఎంపిక జాబితాను వెబ్సైట్ ఓపెన్ చేసి జాబితాలను చూసుకోవచ్చు

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు పోలీసు కానిస్టేబుల్ ఫలితం యొక్క తాత్కాలిక ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు .. 13373 మంది పురుషులు, 2652 మంది మహిళలు ఎంపికయ్యారు. ఈ క్రింది లింక్ వెబ్సైట్ ఓపెన్ చేసి జాబితాలను చూసుకోవచ్చు https://www.tslprb.in/   ఈ లింక్ ను మీ మిత్రులకు షేర్ చేయండి    

ఉత్తమ ఫార్మాసీ ప్రాక్టీస్ పురస్కారానికి ఎంపికైన చిలుకూరు పరమాత్మ

Image
ప్రపంచ  ఫార్మాసిస్టు దినోత్సవం పురస్కరించుకొని  ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ నుండి  నల్గొండకు చెందిన చిలుకూరు పరమాత్మ  ఉత్తమ ఫార్మాసీ ప్రాక్టీస్ పురస్కారానికి  ఎంపికైనారు.  ఈ సందర్భంగా పరమాత్మ  .ఐపిఎకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఆయన  పురస్కారం అందుకొనున్నారు.