Posts

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

Image
  ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి 10వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు దిశ, సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి ఏసీబీకి చిక్కింది. రూ.10వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లిం చడానికి సర్పంచ్ భర్త నుంచి విజయలక్ష్మి రూ. 10వేలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో శుక్ర వారం సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.

50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ

Image
  50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి  డి ఈ ఓ  సంగారెడ్డి జిల్లా : ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంగారెడ్డి డి ఈ ఓ రాజేష్ తో పాటు రామకృష్ణ అనే అసిస్టెంట్. ప్రైవేట్ స్కూలుకు ఎన్ఓసి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈ అధికారులు

తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన కేసీఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్

Image
 తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన కేసీఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్   నల్గొడ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)* లో పేపర్ లీక్ మరియు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని,TSPSC చైర్మన్ సెక్రటరీ లను పదవి నుండి తొలగించాలని,IT మినిస్టర్ KTR ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి, తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని, ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారని అన్నారు. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందని, బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్

గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడిగా గురుప్రసాద్

Image
 గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడిగా నటుకుల గురుప్రసాద్ ను నియమించిన గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ నియమించారు. తనను నియమించిన టంగుటూరి రామకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపిన గురుప్రసాద్. పదవికి శాయశక్తులా కృషి చేసి న్యాయం చేకుర్చుతానని గురుప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.

విస్తృతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు - హైదరాబాద్ జిల్లా ఇంచార్జి డా. దాసోజు శ్రావణ్

Image
  విస్తృతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు - హైదరాబాద్ జిల్లా ఇంచార్జి డా. దాసోజు శ్రావణ్ హైదరాబాద్ , మార్చి 18 : హైదరాబాద్ లో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అట్టహాసంగా జరిపేందుకు ప్రణాలిక సిద్ధం చేసారు. ఈ క్రమంలో ఈరోజు డా. దాసోజు శ్రావణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సమ్మేళనాలు సంబదించిన విశేషాలను మీడియా కు వివరించారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, డా. బి అర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, సెక్రటేరియట్ ప్రారంభోత్సవం, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, సభ్యత్వ నమోదు మరియు బిఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలలపాటు పార్టీ విస్తృతంగా ఎలా చేపట్టాలనే దానిపై ఈరోజు సమావేశమయ్యారు. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ , హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నేతృత్వం లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో MLA కాలేరు వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి , ఎమ్మెల్సీ MS ప్రభాకర్, శ్రీమతి వాణి దేవి, గజ్జల నగేష్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, విప్లవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీన

TSPSC ముట్టడి- బండి సంజయ్ ను అరెస్ట్

Image
  TSPSC ముట్టడి- బండి సంజయ్ ను అరెస్ట్  హైదరాబాద్:  • బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు • బండి సంజయ్ తోపాటు ఈటల రాజేందర్ ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించిన పోలీసులు • పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కార్యకర్తలు... • అడ్డుకున్న కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు...

నల్గొండ వీటి కాలనీలో కుక్కల కుక్కల స్వైర విహారం

Image
  నల్గొండ వీటి కాలనీలో కుక్కల కుక్కల స్వైర విహారం నల్గొండ:  సొంత ఇంటి ముందు నిలబడి వున్న యజమానిని కరిచి పారిపోయిన వీది కుక్క.  వరసగా రెండో రోజు నల్గొండ లోని  V T Colony లో జరుగుతున్న సంఘటనలకు కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.   వేంకటేశ్వరకాలనీ లో కుక్కలు స్వైర విహారం చేస్తన్నాయని,  కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని,  దీంతో పాదచారులై వెళ్ళే పిల్లలు, పెద్దల వెంట కుక్కలు పడుతుండటం చేత ఒంటరిగా రోడ్లవెంట వెళ్ళటానికి భయపడుతున్నారని,కోతులు రోజుల తరబడి ఇళ్ళపై ఉండి రోజువారీ కార్యక్రమాలకి ఇబ్బంది కలిగిస్తున్నాయని,   వేంకటేశ్వరకాలనీవాసులకు కుక్కల, కోతుల బెడద తప్పించగలరని కోరుతూ మునిసిపల్ కమీషనర్ కు మొరపెట్టుకున్న కాలనీ వాసులు