Posts

జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Image
  నల్గొండ, (గూఢచారి) 15-8-2024  నల్గొండ జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.         78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.         అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం ఇస్తూ..... ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోనే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు.         ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కకింద జిల్లాలో రెండు కోట్ల 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఇందుకు ఆర్టీసీ కి 98 కోట్ల 26 లక్షల రూపాయలు లబ్ధి పొందిందని తెలిపారు.        రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 నుండి 10 లక్షల కు పెంచడం జరిగిందని, దీని ద్వారా జిల్లాలో 33 వేల 312 మంది చికిత్సలు చేయించుకొని లబ్ధి పొందగలిగారని తెలిపారు.        ఇంద

ఉత్తమ జిల్లా అధికారిగా జిల్లా సరఫరా అధికారి వి. వెంకటేశ్వర్లు

Image
 ఉత్తమ జిల్లా అధికారిగా జిల్లా సరఫరా అధికారి వి. వెంకటేశ్వర్లు నల్గొండ , గూఢచారి ప్రతినిధి 15-8-2024: భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉత్తమ జిల్లా అధికారిగా జిల్లా సరఫరా అధికారి వి. వెంకటేశ్వర్లు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ  ఉన్నారు.

ప్రజాస్వామ్య బద్ధంగా కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికలు - అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ బచ్చు విలాస్.

Image
 ప్రజాస్వామ్య బద్ధంగా కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికలు - అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ బచ్చు విలాస్. హైద్రాబాద్: 15-8-2024 ప్రజాస్వామ్య బద్ధంగా కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికల నిర్వహిస్తున్నామని అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ బచ్చు విలాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సత్రం మేనేజంగ్ కమిటీ ఎన్నికలు ఈ నెల 16,17,18,19.తేదీలలో నామినేషన్ స్వీకరణ తో ప్రారంభమై పోటీ చేయు అభ్యర్థుల ప్రకటన తో నామినేషన్ ల పక్రియ ముగుస్తుంది. అనంతరం పోలింగ్ తేదీ 1st సెప్టెంబర్ 2024 వాసవి సేవా కేంద్రం లకధికాపూల్ లొ నిర్వాయించడం జరుగుతుంది. ఈ సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు అయినా ఏనాడు ప్రజాస్వామ్య పద్ధతి లొ ఎన్నికలు నిర్వహించ లేదని, ప్రస్తుతం మాత్రం నూటికి నూరు శాంతం సంస్థ రిజిస్టర్డ్ bylaw ను అనుసరించి ఎన్నికలు జరుగుతున్నాయని అయన తెలిపారు. పత్రిక ప్రముఖులు ఈ విషయాన్నీ గమనించి పూర్తి వివరాలు మా వద్ద తీసుకుని వార్తలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నానని, మేము మీకు అందుబాటులో ఉంటాం కావలసిన వివరాలు ఇస్తామని, ఎవరో చెప్పిన నిరాధార వార్తలు రాసి మమ్ములను ఇబ్

వాసవి ఆనంద నిలయం డెవలపర్ లకు షోకాజ్ నోటీసులు

Image
  వాసవి ఆనంద నిలయం డెవలపర్ లకు షోకాజ్ నోటీసులు హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) వాసవి ఆనంద నిలయం డెవలపర్లు పర్యావరణ నిభందనలు ఉల్లంఘించారన్న గూఢచారి  వార్త తో ఎఫెక్ట్.   హైద్రాబాద్:  ఎల్ బి నగర్ లోని వాసవి ఆనంద నిలయం డెవలపర్లు  నిర్మిస్తున్న అపార్ట్మెంట్ విషయం లో పర్యావరణ నిభందనలు ఉల్లంఘించారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు వాటికి ఇచ్చిన అనుమతులు నిలుపుదల చేయాలని కోరుతూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని గూఢచారి ప్రచురించింది. దీంతో అధికారులు వాసవి ఆనంద నిలయం డెవలపర్ లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. డెవలపర్ లు పలు పర్యా వరణ  నిభందనలు ఉల్లంఘించారని, టాస్క్ ఫోర్స్ కమిటీ  మీటింగ్ కు పిలచి సరైన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారి రాష్ట్ర స్థాయి అధికారులకు రిపోర్ట్ పంపారు.  టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగులో తేలనున్న వాసవి ఆనంద నిలయం డెవలపర్ ల నిర్మాణ భవితవ్యం. Also read  👇 *పర్యావరణ నిభందనలు ఉల్లంఘించిన వాసవి ఆనంద నిలయం డెవలపర్లు* https://www.gudachari.page/2024/08/blog-post_5.html *పీసీబీ అధికారుల కుమ్మక్కు!* https://www.gudachari.page/2024/08/blog-post_8.html

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. కృష్ణమూర్తి కి రాష్ట్రపతి మెడల్

Image
యోగ్యమైన సేవలు అందించినందుకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. కృష్ణమూర్తి  రాష్ట్రపతి మెడల్ పొందిన సందర్భంగా శుభాకాంక్షలు

హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Image
హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.. విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన. ఇవాళ సాయంత్రం  కోకాపేట్ లో కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్న సీఎం.  

ప్రజాస్వామ్య బద్ధంగా కాశి సత్రం ఎన్నికలు* 41 మంది నామినేషన్ల పత్రాలు స్వీకరణ*

Image
   ప్రజాస్వామ్య బద్ధంగా కాశి సత్రం ఎన్నికలు* 41 మంది నామినేషన్ల పత్రాలు స్వీకరణ* హైద్రాబాద్ : (గూఢచారి ప్రతినిధి) శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు సెప్టెంబర్ 1న హైద్రాబాద్ లకడికపూల్ వాసవి సేవా కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న  41 మంది అర్హత ఉన్న  సభ్యులు  దాదాపు 135 నామినేషన్లు పత్రాలు  ఎన్నికల అధికారి నుండి తీసుకున్నారు.  ఈ ఎన్నికల్లో అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు) సెక్రటరీలు ఏడుగురు, (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు), అడ్వైజర్లు 19 మంది కి (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి 13 మంది కర్ణాటక నుండి నాలుగు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒక్కరు) ఎన్నికలు నిర్వహించబడతాయి.  ఆగస్టు 16, 17 తేదీల్లో ఉ