Posts

మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.

Image
 *మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.*  Hyderabad  నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో నిన్న మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిల పై దాడి చేసి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. రుణమాఫీ పై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరాము. ఈ అంశంపై స్పందించిన డిజిపి జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో  టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నా

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

Image
 ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ హైదరాబాద్, (గూఢచారి): హైదరా బాద్ వనస్థలి పురంలోని సరూర్ నగర్ విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆటోనగర్లోని డీఈ కార్యాల యంలో గురు వారం విద్యుత్ శాఖ డీఈ (టెక్నికల్) రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆగపల్లి గ్రామంలో ఓ వెంచర్లో విద్యుత్ స్తంభా లను షిఫ్టింగ్, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కేవీ లైన్స్ నుంచి 11కేవీ లైన్స్ మార్చడానికి వెంచర్ యజమాని డీఈ రామ్మోహనన్ను సంప్ర దించాడు. ఇదివరకే సదరు వెంచర్ యజమాని ఆన్లైన్లో దరఖాస్తు చేసు కున్నాడు. అయితే అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి రూ.50 వేలు ఇవ్వాలని డీఈ రామ్మోహన్ డిమాండ్ చేశాడు. కాగా రూ. 50వేలు ఇవ్వలేనని, రూ. 18వేలు ఇస్తానని వెంచర్ యజమాని తేల్చిచెప్పడంతో అందుకు డీఈ అంగీ కరించాడు. లంచం మొత్తాలు ఇస్తే పని ప్రారంభిస్తానని చెప్పడంతో వెంచర్ యజమాని(బాధితుడు) నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ పరిధిలోని ఆపరేషన్స్ విభాగం కింద ఉన్న సూపరింటెండెంట్ ఇంజ

గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

Image
  గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..  17 మంది విదేశీ యువతిలను పట్టుకున్న పోలీసులు.  విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పట్టివేత  అన్ లెన్ వెబ్ సైట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా  గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు.. కొండాపూర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం  కెన్యా కి చెందిన 14 మంది, ఉగాండా కి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి ఒకరు అరెస్ట్..  నిర్వాహకుడు శివ కుమార్ తో పాటు ఇద్దరు విటులను అరెస్టు  లోకాంటో వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్న నిర్వాహకుడు శివకుమార్.... గత కొన్నేళ్ల నుంచి విదేశీయువతులతో వ్యభిచార నిర్వహిస్తున్న శివకుమార్.

రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలి

Image
     రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.       బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వాన కాలం ,గత యాసంగి సిఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు.         గత వానాకాలానికి సంబంధించి 71% సీఎంఆర్ పూర్తి చేయడం జరిగిందని, తక్కిన 29 శాతాన్ని రైస్ మిల్లర్లు రోజువారి నిర్దేశించిన ప్రకారం సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని అన్నారు. ఇందుకుగాను ప్రతిరోజు సీఎంఆర్ డెలివరీ చేయాలని అన్నారు.యాసంగికి సంబంధించిన 54% సీఎంఆర్ పూర్తి కాగా, తక్కిన వి డెలివరీ చేయడం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని అన్నారు       జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ,రైస్ మిల్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ____________________________________  జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

Image
*Breaking News :* చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ 70 మంది విద్యార్థులకు అస్వస్థత.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వేటు వేసిన మల్టీ జోన్ -11 ఐజిపి శ్రీ వి .సత్యనారాయణ

Image
  తేది: 21-08-2024. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వేటు వేసిన మల్టీ జోన్ -11 ఐజిపి వి .సత్యనారాయణ ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా మరియు ఆలంపూర్ సమీపంలోని ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, కర్నూలు జిల్లాకు చెందిన కొంత మంది పేకాట రాయుళ్లు భారీ స్థాయిలో పేకాట ఆడుతుండగా, జిల్లా పోలీస్ బృందం దాడి చేసి వారిని పట్టుకుంది. ఆ పేకాట దాడిలో వచ్చిన ఆరోపణల మేరకు, ఎస్పీ జోగులాంబ గద్వాల్  శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులతో ఎంక్వయిరీ చేయించిన తర్వాత, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ -11 శ్రీ వి. సత్యనారాయణ ఉపక్రమించారు. వీరిలో జోగులాంబ గద్వాల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ జములప్ప, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట ఎస్సై విక్రం పేకాట రాయుళ్లతో పరోక్ష సంబంధాలు ఉన్నట్లు, అలాగే ఉండవల్లి ఎస్సై శ్రీనివాసులు తన పోలీస్ స్టేషన్ పరిధిలో అంత పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నప్పటికీ, దానిపై జిల్లా పోలీస్ పార్టీ దాడి చేసేవరకు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. అందువల్ల, ఈ ముగ్గురు అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి వి ఆర్ లో పెట్టడం జరిగింది, వారిపై కఠి

ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ - యూసుఫ్ బాబు, దాస్ యం

Image
 ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ  సమస్యల సాధనకు కృషి  టీఎస్ఎండిపిఏ విలీనం   యూసుఫ్ బాబు, దాస్ యం  నల్గొండ, గూఢచారి ప్రతినిధి: ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ సాధ్యమని తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగిలు అన్నారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో సంఘం గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం అధ్యక్షతన జరిగిన తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం లీడర్స్ మీట్ కు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. చిన్న మధ్యతరహా పత్రికల కొత్త ఎంపానల్ మెంట్, అక్రిడి టేషన్, అప్ గ్రేడ్, ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యల సాధనకు సమిష్టి కృషి చేద్దామన్నారు. దిన పత్రికలకు ప్రతి నెల రెగ్యులర్ యాడ్స్ కు తోడు మ్యాగజైన్స్ కూడా వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2018 తదుపరి దిన పత్రికల అప్ గ్రేడ్ పెండింగ్ ఉందని, ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించేందుకు ప్రణాళిక