Posts

2వేలు లంచం తో ఏసీబీ కి చిక్కిన హెడ్ మాస్టర్

Image
 2వేలు లంచం తో ఏసీబీ కి చిక్కిన హెడ్ మాస్టర్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్, యెల్లండు, భద్రాద్రి కోతగూడెం జిల్లా ప్రధానోపాధ్యాయుడు/హెడ్ మాస్టర్ ACB కి చెక్కారు. 09.01.2025న, సుమారు 09.33 గంటలకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి భీమనపల్లి కృష్ణ, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్, యెల్లండు, భద్రాద్రి కోతగూడెం జిల్లా ప్రధానోపాధ్యాయుడు, ACB, ఖమ్మం యూనిట్ ద్వారా, ఆయన డిమాండ్ చేసిన రూ. 2,000/- లంచం మొత్తాన్ని ఫిర్యాదుదారు ద్వారా A-2 కోట్చెర్ల రామ కృష్ణ, అటెండర్ (ఔట్ సోర్సింగ్) వద్ద స్వీకరించినప్పుడు పట్టుబడ్డారు. AO-1 ఫిర్యాదుదారుడిని, డిమాండ్ చేసిన లంచం మొత్తం చెల్లించకపోతే, తన జీత బిల్లులను సంబంధిత అధికారులకు సమర్పించమని బెదిరించారు. A2 యొక్క కుడి చేతి వేళ్లపై మరియు కుడి జేబు వెనుక భాగంలోని అంతర్గత ఫ్లాప్‌పై నిర్వహించిన రసాయన పరీక్షలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. A-2 వద్ద నుండి రూ. 2,000/- లంచం మొత్తం పునరుద్ధరించబడింది. భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు రహస్యంగా ఉంచబడుతున్నాయి. అందువల్ల, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి-1, భీమనపల్లి కృష్ణ, తెలంగాణ మైనారిటీ రెసి...

ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు- FIR కి డిమాండ్ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్

Image
ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు-  FIR కి డిమాండ్ చేసిన  ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని సంబధిత పోలీసులు FIR చేయకుండా నిర్లక్ష్యం చేయడం తో ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్ FIR చేయాలని డిమాండ్ చేసి చేయించారు.    

ACB కలకలం - పీడీఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్

Image
ACB కలకలం - పీడీఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్ • కొంత డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ACB కలకలం ఏసీబీ అదుపులో ఓ పోలీసు అధికారి తొర్రూరు, గూఢచారి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదిలాబాద్ కు చెందిన ఓ నిందితుడి నుంచి పోలీసు అధికారి రూ.4లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించిం ది.

ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు*

Image
 *ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ ప్రీమియర్ ఎక్ ప్లోజీవ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతిచెందగా, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలయ్యాయి. ప్రకాష్ కు భువనగిరి ఏరియా హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మంది కార్మికులు కూడా గాయపడగా వారిని కూడా హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించినట్లు తెలుస్తుంది.

*తెలంగాణ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సమీ.*

Image
 *తెలంగాణ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సమీ.* హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ 7వ వార్షిక సమవేశంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన అబ్దుల్ సమీ కి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు, అబ్దుల్ సమీ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ అధికారులుకు ఏ సమస్య వచ్చినా నేను పరిష్కారానికి దారి చూపిస్తానని, అదేవిధంగ నా యొక్క ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఒకే రోజు #ఏసీబీకి చిక్కిన ఇద్దరు

Image
 ఒకే రోజు ఏసీబీకి చిక్కిన ఇద్దరు 28-12-2024  శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "ఫిర్యాదిదారుడి సోదరి భూమిలో సర్వే చేసి అధికారిక సర్వే రిపోర్ట్ సమర్పించినందుకు గాను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ Merugu Rathnam, డిప్యూటీ సర్వేయర్, దమ్మన్నపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన ఎండ్రాల మల్లేశం, నాయబ్ తహశీల్దార్ 6,000/- లంచం మొత్తాన్ని వ్యవసాయ భూమిని నాలా మార్పిడి ఫైల్ ఫార్వర్డ్ చేయమని ఫిర్యాదుదారుడి నుండి డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. " 

విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక

Image
విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక  హైదరాబాద్, డిసెంబర్ 25: ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక నిన్న హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో అతి ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెళ్లీడు ఉన్న ఆర్యవైశ్య అమ్మాయిలు మరియు అబ్బాయిలు సుమారు 110 మంది పాల్గొని పరస్పర పరిచయాలు చేసుకున్నారు. వాతావరణం సంపూర్ణంగా పెళ్లి వేడుకగా మారింది. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేదిక రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ముఖ్య అతిథులుగా రమేష్ గెల్లి గ మరియు తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత హాజరై తమ స్ఫూర్తిదాయకమైన మాటలతో కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించారు. రమేష్ గెల్లి మాట్లాడుతూ, జీవిత భాగస్వామి ఎంపికలో ఓపిక, సర్దుకుపోయే గుణం ముఖ్యమని హితవు పలికారు. శ్రీమతి కల్వ సుజాత ఈ సందర్భంలో మాట్లాడుతూ, భాగస్వామి ఎంపిక ఈ రోజుల్లో ఎంత కష్టమైనదో వివరించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆవోపా నిర్వాహకుల శ్రమను ప్రశంసించారు. సభాధ్యక్షులు నమశివాయ స్వాగత ఉపన్యాసంలో ఈ సంవత్సరంలో కొత్తగా ...