అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ: అర్హత కలిగిన పేద జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా ఫోటోలు క్రీడా పోటీల్లో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతు ప్రధానం చేయడంతో పాటు, అర్హులైన జర్నలిస్టులకు ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50 శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50% రాయితో కూడిన ఉచిత వైద్య సేవలను అందించడం అభినందనీయం అన్నారు. నల్లగొండ పట్టణంలో అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో దివంగము దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాని సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు పట్టాల పంపిణీ ఆలస్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో పేదలందరికీ ఇండ్లను ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని పేద విలే...