Posts

కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహాసభ ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి

Image
  కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహాసభ ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి హైద్రాబాద్: ప్రణవ్ మునిగెల, అడ్వొకేట్ తేది 17-2-2025 రోజున ఎ.వెంకటేశం, s/0. లక్ష్మీనారాయణ, షాద్ నగర్ వారు 3 వ అడీషనల్ చీఫ్ జడ్జ్, సిటి సివిల్ కోర్టు, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ గురించి కేసు I.A.253 of 2025 In O.O.P. No.6 of 2025 వేసినాడని, అట్టి కేసులో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసినదని, ఆ ఉత్తర్వులు కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఉన్నాయని, సదరు ఉత్తర్వుల కాపీని మాకు ఈరోజు అందజేసి, ఇట్టి ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచాలని కోరినందున, మేము ఇట్టి ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినాము. తదుపరి ప్రక్రియ తెలియజేయగలమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల తోడుపునూరి చంద్రపాల్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి స్టేటస్కో కాపీ ని అందచేసిన ఆ.వెంకటేశం

Image
 తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి స్టేటస్కో కాపీ ని అందచేసిన ఆ.వెంకటేశం హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు స్టేటస్కో కాపీ ని ఈరోజు ఉదయం తెలంగాణ ఆర్యవైశ్యమ హాసభ హైదరాబాద్ లోని చింతల బస్తీ కార్యాలయం లో ఎన్నికల అధికారి చంద్రపాల్ కు అందజేసిన కోర్టులో  పిటిషన్ వేసిన వెంకటేశం.

మహాసభ లో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన A టీమ్ అప్రజాస్వామిక పోకడలకు చెంపపెట్టు.

Image
 మహాసభ లో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన A టీమ్ అప్రజాస్వామిక పోకడలకు చెంపపెట్టు. హైద్రాబాద్: మొదటి నుండి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విషయంలో అప్రజాస్వామ్యం తాండవించింది. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం నెగ్గుతుందని ఈ కోర్టు జోక్యాలే  సాక్ష్యం. ఈ విషయం తో ఇప్పటికైనా A టీం కు జ్ఞానోదయం కావాలి. బడా నాయకులందరూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించేందుకు అన్ని కోర్టు కేసులు రద్దు జరిగేలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా పునుకుంటే బాగుంటుందని పలువురు ఆర్యవైశ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ప్రకటించిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు ఎన్నికలు ల్లో నలుగురు నామినేషన్ వేశారు. అందులో ఒకరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు స్టే వచ్చింది. ఆయన నేనే అధ్యక్షుడిని అని ప్రకటింప చేసుకొని 9 మందితో తెలంగాణ ఆర్యవైశ్య A టీమ్ నాయకుడు మహాసభ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని మేమే తెలంగాణ ఆర్యవైశ్యులు లకు హక్కుదారులమంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లో ఉన్న ఎఫ్డీలు పంచుకున్నారు. అంతేకాకుండా వైశ్య భవన్ కూడా పార్టిషన్ ఈ సొసైటీ పేరుతోనే చేసుకున్నారు. ...

IVF & WAM గురించి మహాసభ ఎలక్షన్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులు*

Image
  *మహాసభ ఎలక్షన్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులు* ఐవిఎఫ్ మరియు వామ్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు. వెంటనే క్లాస్ 3 ( IVF మరియు WAM అనర్హతకు సంబంధించి) తొలిగించి తగు నిర్ణయం తీసుకోవాల్సింది గా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ EC. మెంబర్ మరియు  ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మహాసభ అధ్యక్షులు గట్టు మహేష్ బాబు గారు క్లాస్ 3 కి వ్యతిరేకంగా వేసిన  రిట్ పిటిషన్( IVF మరియు WAM లో పదవులు అనుభవిస్తున్న వ్యక్తులకు మహా సభ ఎలక్షన్ లో పోటీ చేయుటకు అనర్హత) సంబంధించి హైకోర్టు ఈరోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేస్తూ సదరు వ్యక్తులకు పోటీ చేసే అవకాశం ఇచ్చి అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!

Image
  ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్! రిటర్నింగ్ అధికారికి హై కోర్టు నోటీసులు! ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుల మొట్టికాయలు ఫిబ్రవరి 8నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను తాత్కాలిక నిలిపివేత మార్చి 4 వరకు స్టేటస్ కో ఈ పిటిషన్లపై మార్చి 21న విచారణ హైద్రాబాద్, గూఢచారి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలపై కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి తదనుగుణంగా తీర్పుల నిచ్చాయి. ఏ వెంకటేశం అనే వ్యక్తి హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు చీఫ్ జడ్జి – 2 మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియపై స్టేటస్కో విధిస్తూ యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. మహాసభ ఎన్నికల కోసం ఈనెల 8వ తేదీన విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. మార్చి 4వ తేదీ వరకు స్టేటస్కు కొనసాగుతుందని ఆదేశించారు. మహాసభ అధ్యక్ష ఎన్నిక కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలన్న అభ్యర్థులతో పాటు తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.

ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు

Image
 ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు హైద్రాబాద్ :  ఎన్నికల అధికారి ప్రకటించిన వివరాలు ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు. ఈరోజు నాగర్ కర్నూలు వాస్తవ్యులు, అడ్వొకేట్ అయిన శ్రీ ఎ.బంగారయ్య గారు లిఖితపూర్వకంగా మరియు నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ IA 39 of 2025 in EOP No. 1/2025 జత చేసి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయుటకు అర్హుడు కాడని మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరగనందున మహాసభ నియమావళి 11 (డి) ప్రకారం అతనికి మరియు నాగర్ కర్నూలు జిల్లాలోని ఇతర సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని తెలియజేస్తూ, శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారి నామినేషన్ ను పరిగణన లోకి తీసుకోకూడదని మరియు తిరస్కరించవలెనని ఆయన ఆక్షేపణ తెలుపుతూ, దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవలసినదిగా కోరిన దృష్ట్యా, ఇట్టి విషయాన్ని మేము ప్యానెల్ ఆఫ్ అడ్వొకేట్స్తో సంప్రదించి నిర్ణయం ప్రకటించడం జరుగుతుం ది.

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సుజేంద్ర శెట్టి నామినేషన్

Image
 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సుజేంద్ర శెట్టి నామినేషన్*  *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికలలో భాగంగా ఈరోజు హైద్రాబాద్ లోని ఆర్యవైశ్య మహాసభ భవనంలో నారాయణపేట జిల్లా ఆర్య వైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు కె సుజేంద్ర శెట్టి గారు ఎన్నికల అధికారి తొడుపునురీ చంద్రపాల్ గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీకి నామినేషన్ పత్రాలను అందజేశారు* *ఈ కార్యక్రమంలో మన జిల్లానాయకులు*  *కల్వ శ్రీనివాసులు, పూరి వెంకటేష్, కె రవీందర్, పి రమేష్. పీ బస్వరాజ్ , పొగాకు సింహచలం* గార్లు పాల్గొన్నారు